బుధవారం తిరుపతిలో టిడిఎల్పీ సమావేశం అట్టహాసంగా జరిగిన తర్వాత ఈరోజు ఉదయం గెలుపొందిన తెదేపా నాయకులతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు నాయుడు తిరుమలకు పూర్వ వైభవాన్ని తీసుకునివస్తానని మాటిచ్చారు.
క్యూలో నిల్చుని ఉన్న భక్తులతో మాట్లాడి వారికి కలుగుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత మీడియా ప్రతినిధులతో, తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలుగని రీతిలో ప్రత్యేక ఏర్పాట్లను చేసామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా తిరుమలకు విచ్చేసే భక్తులకోసం లోగడ తను తలపెట్టిన ప్రాణ దానం పథకాన్ని తిరిగి మెరుగైన విధంగా అమలుపరుస్తామని చెప్పారు. ఆ పథకంలో తిరుమలను సందర్శించే భక్తులకు ఉచిత వైద్య సేవలను అందించటం జరుగుతుంది.
తిరుమల ఆలయానికున్న మరో సమస్య ఎర్రచందనం దొంగల వలన వస్తోంది. అధికారులను తప్పుదోవ పట్టించటానికి వాళ్ళు అడవిలో నిప్పు పెట్టటం వలన దోచుకున్నంత దోచుకోగా అరుదైన అటవీ సంపద బుగ్గిపాలవుతోంది. దానితో పాటు అరణ్యంలోని జంతువులు కూడా జనావాసం వైపు రావటం జరుగుతోంది. అందువలన ఈ స్మగ్లర్ల ఆగడాలను అంతం చేస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ఇవే కాకుండా తిరుమలను ప్రక్షాళన చెయ్యవలసిన అవసరం ఉందని కూడా చంద్రబాబు అన్నారు. గోవింద నామం తప్ప అక్కడ మరే ఇతర మతాలకు చెందిన స్మరణలు లేకుండా చర్యలు చేపడతామని అన్నారు. ఆలయాలకు నిలయమైన చిత్తూరు జిల్లాను పర్యాటక స్థలంగా అభివృద్ధి చేస్తామని కూడా చంద్రబాబు తెలియజేసారు.
అయితే రాష్ట్రంలో అవినీతి లేని పాలన, పేదరికం లేని సమాజాన్ని సృష్టించటానికి చంద్రబాబు స్వామివారి అనుగ్రహాన్ని కూడా కోరుకున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more