తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లితే చాలు.. ఇక్కడ తెలంగాణ నేతలు ఆవేశంతో ఊగిపోతున్నారు. చంద్రబాబు తెలంగాణ పై మరో కుట్ర చేస్తున్నాడని.. మీడియాలో గోల గోల చేస్తారు. కానీ బాబు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు. అనే విషయం గురించి ఎవరు ఆలోచించరు. రాజధాని లేని రాజ్యానికి ముఖ్యమంత్రి అవుతున్న తరుణంలో కేంద్రంలోని పెద్దల సాయం చాలా అవసరం ఉంటుంది కాబట్టి, బాబు ఢిల్లీ వెళ్లుతున్నారు.
బాబు ఢిల్లీ ప్రయాణంపై..ప్రతిపక్ష నేతలు,రాజకీయ పార్టీలు, టీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చంద్రబాబు వల్లే పోలవరం ఆర్డినెన్స్ వచ్చిందని, తెలంగాణ పై ఇంకా చంద్రబాబు విషం చిమ్ముతున్నాడని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారు.
నిన్న ఢిల్లీకి వెళ్లిన బాబు .. బిజేపి నాయకులతో.. తెలంగాణ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. తెలంగాణ కు కరెంట్ తగ్గించకండని కేంద్రంలోని పెద్దలను కోరినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో మోడీ సహా 11 మంది కేంద్ర మంత్రులను కలిశానని... తమ డిమాండ్ల పట్ల అందరూ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని సమస్యల పరిష్కారానికి పలుమార్లు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు.
ఏపీకి తక్కువగా విద్యుత్ ను కేటాయించినందున ఎన్టీపీసీ నుంచి ఆ లోటును భర్తీ చేయాలని... తెలంగాణకు కేటాయించిన విద్యుత్ ను తగ్గించకుండానే సీమాంధ్రకు న్యాయం చేయాలని ప్రధాని మోడీని కోరినట్టు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more