హైద్రాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను కమ్యూనిస్ట్ భావజాలం నుంచి పక్కకు పోవటం లేదని అన్నారు. లెఫ్ట్ రైట్ రెండు భావజాలాల సారాంశంతో తయారు చేసి హైబ్రీడ్ రాజకీయం సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు. కార్పొరేషన్ ఎన్నికలలో జనసేన, తెదేపా, భాజపాలు కలిసి కూటమిగా పోటీ చెయ్యవచ్చని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఒక సంవత్సర కాలంలో జనసేన పార్టీ నిర్మాణం జరుగుతుందని, చేతిలో ఉన్న సినిమాల వలన ఆరు నెలలు అందులో బిజీగా ఉన్నా, పార్టీని నడిపించే బాధ్యత పూర్తిగా తనమీదనే ఉందని, చెప్పినట్లుగానే విలువలతో కూడిన రాజకీయాల కోసమే తాను అడుగుపెట్టానని, అదే విధంగా పార్టీని నడుపుతానని పవన్ కళ్యాణ్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తెలియజేసారు. పార్టీ కార్యాలయం నానక్ రాం గుడా పరిసరాల్లో ఉండవచ్చని ఆయన అన్నారు.
2014 ఎన్నికలలో మోదీ కంటే వేరే ఎవరూ సమర్ధవంతంగా కనిపించకపోవటంతో ఆయనతో కలిసి పనిచేసానని అన్న పవన్ కళ్యాణ్ భాజపా తో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. అయితే రాజకీయాలలో ఒక్కసారే పెనుమార్పు వస్తుందని కూడా నమ్మనని, దానికి సమయం పడుతుందని తెలుసని, ఎన్నికలలో అభ్యర్థులు ఓడిపోయినా నీరసపడేది లేదని, అంత మాత్రం చేత రాజకీయాలలోంచి పారిపోనని, ఓడిన ప్రతిసారీ దాన్నో అనుభవంలా చూస్తానని, చెగువేరా లాంటి గొప్ప ఉద్యమ నాయకులే ఎన్నోసార్లు పరాజయాన్ని పొందారని పవన్ కళ్యాణ్ అన్నారు.
మోదీ, చంద్రబాబుల వలన దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయన్న విశ్వాసాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఉచిత సలహాలిచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టనని, అయితే తన అవసరం ఉందని వాళ్ళు అనుకున్నప్పుడు మాత్రం తప్పక సాయంగా నిలబడతానని మాటిచ్చారు.
నేతలను గుర్తించి జనసేనలోకి ఆహ్వానించటం, పార్టీ కార్యక్రమాలను రచించి ముందుకు తీసుకెళ్ళటం ఆరు నెలల్లో పూర్తి చేస్తానని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more