ఉద్యోగుల విభజనలో అరిచే నాయకుల నోళ్ళు మూతలుపడేట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. వాటి ప్రకారం జనాభా ప్రాతిపదికన అంటే 41.68, 58.32 నిష్పత్తిలో ఉద్యోగుల భట్వారా జరగాలని, తెలంగాణాలో ఉద్యోగులు తక్కువపడితే ఆంధ్రా నుంచి సర్దుబాటు చెయ్యాలని, అలాగే ఆంధ్రాలో ఉద్యోగులు అవసరం పడితే తెలంగాణా నుంచి సర్దుబాటు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇది తాత్కాలిక ఏర్పాటేనని, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని ఈ సమస్యను పరిష్కరించుకోవలసివుంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తెలియజేసింది.
సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణాలో పనిచెయ్యనివ్వం, గేట్లు దాటి లోపలికి రానివ్వమంటూ ఉద్యోగ సంఘాలతో సమావేశమైన కెసిఆర్ వ్యాఖ్యానించటం జరిగిన వెంటనే ఇలాంటి మార్గదర్శకాలు రావటం మీద తెలంగాణా నాయకులు మండిపడుతున్నారు.
మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి-
* గ్రామ స్థాయి నుంచి మల్టీ జోనల్ కేడర్ వరకు ఎక్కడ పని చేస్తున్నవారు అక్కడే కొనసాగుతారు. ఒకవేళ అక్కడ మంజూరైన పోస్ట్ లలో ఉద్యోగులు తక్కువ పడితే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సర్దుబాటు చేస్తారు. అంటే అవసరమైతే తెలంగాణాకు ఆంధ్రా నుంచి ఉద్యోగులను సర్దుబాటు చెయ్యటం జరుగుతుంది.
* సర్వీస్ రిజిస్టర్ లో నమోదైన స్థానికత ఆధారంగానే ఉద్యోగుల నియామకం జరుగుతుంది.
* తెలంగాణాలోని ప్రత్యేక ప్రాజెక్ట్ లు, ప్రత్యేక కార్యాలయాలు, ప్రత్యేక సంస్థలలోని ఉద్యోగులు ఎక్కడివారు అక్కడే కొనసాగుతారు.
* ఇక సచివాలయం, శాఖాధిపతులు, లెజిస్లేచర్లు, రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, సంస్థలలో పనిచేసే ఉద్యోగులను జనాభా ప్రాతిపదికన విభజిస్తారు. ఆ కార్యాలయాలలో కేటాయించి ఉద్యోగుల సంఖ్య మంజూరైన పోస్ట్ ల కన్నా ఎక్కువగా ఉండరాదు.
* కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ లలో పనిచేసేవారి భట్వారా జరగదు.
* తాత్కాలిక పదవులలో పనిచేస్తున్నవారు అప్పాయింటెడ్ డే కి ముందుగా తమ తమ రెగ్యులర్ పోస్ట్ లలోకి వెళ్ళిపోవాలి.
* కొత్త పోస్ట్ ల మంజూరు, పదోన్నతుల విషయంలో కొత్త ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more