తెలంగాణా కాంగ్రెస్ నేతలు శుక్రవారం సోనియా రాహుల్ గాంధీలను కలవటానికి వెళ్ళారు. అయితే వాళ్ళని చూడగానే రాహుల్ విరుచుకుపడ్డారు. తెలంగాణా ఇస్తే చాలు 15 మంది ఎంపీలు, 100 మంది ఎమ్మెల్యేలు గ్యారెంటీ అన్నారు ఏమైంది, మీరే ఓడిపోయారు, మమ్మల్ని బాగా మోసం చేసారంటూ రాహుల్ గాంధీ తెలంగాణా కాంగ్రెస్ నాయకులను నిలదీసారాయన.
పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ గౌడ్, సిరిసిల్ల రాజయ్య, వివేక్, సురేశ్ పెట్కార్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నరేశ్ జాదవ్ లు తాము కాంగ్రెస్ ని గెలిపించలేకపోయామని అధిష్టానానికి క్షమాపణలు చెప్పటానికే అసలు ఢిల్లీ వెళ్ళారు. అయితే అందుకు వాళ్ళు చెప్పిన కారణాలు అధిష్టానానికి మరింత కోపం తెప్పించాయి. మోదీ హవా ఉందని, పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాట్లాడటం తెరాస కు లాభం చేకూర్చిందని, సరైన నాయకత్వం లేకపోవటం లోపమని ఇలా చెప్పుకొచ్చారు తెలంగాణా నాయకులు.
మోదీ హవా అనగానే మండిపడ్డ రాహుల్, అయితే కెసిఆర్ ఎలా గెలిచాడు అని అడిగారు. పవన్ కళ్యాణ్ ప్రచారం, అన్నదానికి, నాయకత్వం లేదు అన్నదానికి, తెలంగాణా ఇస్తే చాలు మరేమీ అక్కర్లేదని అన్నారు మీరు. తెలంగాణా ఇచ్చాం కానీ మీరు దాన్ని ప్రజల్లోకి తీసుకునివెళ్లటంలో విఫలమయ్యారు. అందువలన మేమేం ప్రచారం చేసుకోవలసివచ్చింది అన్నారు రాహుల్.
తెలంగాణా కోసం మేము ఎంతో పోరాడితే మీరు అందులో పనిచెయ్యనివాళ్ళకి నాయకత్వం అప్పగించారు. ప్రచారంలో మమ్మల్ని పట్టించుకోలేదు అని తెలంగాణా నాయకులు అధిష్టానాన్ని తప్పుపట్టారు. ముఖ్యమంత్రి పదవికి ఏకంగా డజన్ మంది పోటీ పడ్డారని, సీమాంధ్రకి చెందిన కెవిపి రామచంద్రరావు ఎమ్మల్యే ఎంపీ అభ్యర్థుల ఎంపిక చేసారని ఆరోపించారు. పైగా, ప్రచారంలోకూడా కెసిఆర్ లాగా సీమాంధ్రులను కించపరుస్తూ మాట్లాడలేకపోవటానికి కారణం ఇరు ప్రాంతాలలోను కాంగ్రెస్ పార్టీ ఉండటమేనని కూడా చెప్పుకొచ్చారు.
అయితే ఇంత గంభీరంగా రాహుల్ తో మాట్లాడినవాళ్ళు సోనియా దగ్గరకు పోయేసరికి నీరుగారిపోయారు. వెళ్తూనే ఖిన్న వదనాలతో గద్గద స్వరాలతో, మమ్మల్ని క్షమించండి, తెలంగాణా ఇచ్చినా పార్టీని గెలిపించలేకపోయామంటూ ప్రాధేయపడ్డారు.
మేము ఇమ్మంటే తెలంగాణా ఇచ్చారు సరే కానీ, మేము ఇమ్మన్నప్పుడు ఇచ్చారా, మీ ఇష్టమొచ్చినప్పుడు మీరు ఆ పని చేసారు, అదే పని మొదట్లోనే చేసుంటే కెసిఆర్ హీరో అయ్యే అవకాశం ఉండేది కాదు గదా. అసలు మీరు ఏమనుకుంటున్నారో మాకు చెప్పకుండా, మాకు ఏమీ అర్థం కాకుండా, వెనక్కి వెళ్లి ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కాక, కెసిఆర్ చేత కూడా మాటలు అనిపించుకుని, సంవత్సరాలు గడిపాం. మాకేమైనా తెలిస్తే కదా అక్కడ చెప్పటానికి. అందుకని ముఖం చాటేసుకునే తిరిగాం. రాజీనామాలు చెయ్యాలనే ఒత్తిడి కెసిఆర్ నుంచి ఏ స్థాయిలో వచ్చిందో మీకు తెలియంది కాదు. మేము ఎప్పుడు ఢిల్లీ వచ్చినా, తెలంగాణతో తిరిగి రాకుంటే ప్రజలు మిమ్మల్ని గ్రామాల్లోకి రానివ్వరంటూ కెసిఆర్ ఎత్తిపొడుపులు భరించాం. మీ వల్లనే కదా కాంగ్రెస్ నాయకులు కొందరు విసుగెత్తి తెరాస లో కలిసిపోయారు అని ఘాటుగా చెప్దామనుకున్న మాటలన్నీ వాళ్ళ గొంతులోనే ఆగిపోయాయి. ఏమీ చెప్పలేకపోయారు. ఎంతైనా అధిష్టానం కదా!
"సరే, అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పటికైనా కష్టపడి పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకుని రండి" అన్నారు సోనియా. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more