2014 ఎన్నికల్లో తుఫాన్ సృష్టించిన భారతీయ జనతా పార్టీకి నాయకుడిగా ఎంపికైన నరేంద్ర మోదీకి దేశ బాధ్యతలతో పాటుగా మరో సవాల్ ఎదురవుతోంది. అది ఉగ్రవాదుల నుండి. అందుకు సంకేతంగా రెండు రోజుల క్రితం మే 16న నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) విద్యార్థులను భోపాల్ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టటానికి తీసుకునిపోతుంటే, కోర్టు ఆవరణలో, అబ్ కి బార్ మోదీ కా నంబర్ అని, తాలిబాన్ జిందాబాద్ అని నినాదాలు చేసారు. అదే సమయంలో ఢిల్లీలో మోదీకి స్వాగతం పలుకుతున్నప్పుడు అక్కడ కూడా అదే సమయంలో అవే నినాదాలు వినిపించాయి.
భోపాల్ పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పినదాని ప్రకారం 18 మంది సిమి కార్యకర్తలు, వాళ్ళ మధ్యప్రదేశ్ నాయకుడు, ఉగ్రవాదచర్యలో నిందితుడు అబు ఫైజల్ తాలిబాన్ అనుకూలంగానూ, మోదీకి ప్రతికూలంగానూ నినాదాలు చేసారు. ఈ విషయం మీద స్పందించిన మధ్య ప్రదేశ్ హోం మంత్రి బాబులాల్ గౌర్ మాట్లాడుతూ, దేశానికి వ్యతిరేకంగా పనిచేసే సంస్థలలో చెలరేగుతున్న అలజడే ఇందుకు కారణమని, మోదీ అధికారాన్ని చేపట్టటాన్ని వాళ్ళు సహించలేకపోతున్నారని, ఎందుకంటే ఉగ్రవాదుల పట్ల మోదీ ఉగ్రనారసింహుడేనని అన్నారు. అయితే ఈసారి సిమి కార్యకర్తలు, నాయకులను జైల్లోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిస్తామని కూడా ఆయన అన్నారు.
మధ్య ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నందన్ డుబే మాట్లాడుతూ, సిమి అన్నది బహిష్కరించిన ఉగ్రవాద సంస్థని, కోర్టు ఆవరణలో మీడియాను చూసేసరికి వారు పెచ్చు మీరిపోయారని అన్నారు.
మోదీ ర్యాలీలకు ముందుగా ఆ ఉగ్రవాద సంస్థ రెక్కీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిసింది. ఛత్తీస్ గఢ్ పోలీసుల ప్రకారం రాజ్ పూర్ లో ఉగ్రవాద శిక్షణా శిబిరంలో పనిచేస్తున్నప్పుడు సిమి నాయకుడు ఉమర్ సిద్దిక్వి ఇండియన్ ముజహిదీన్ సంస్థతో సంపర్కంలో ఉన్నారు. పట్నాలో విఫలమైన తర్వాత ఇండియన్ ముజాహిదీన్ రాయ్ పూర్ లో మోదీ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు మరో సారి ప్రయత్నం చేసారు కానీ నిఘా వర్గాలు వాళ్ళ ప్రయత్నాలను వమ్ముచేసాయి.
మోదీ ముస్లింలకు వ్యతిరేకనే భావన కలగటంతో సిమి సంస్థ ఇతర ఉగ్రవాద సంస్థలతో కలిసి ఉగ్రవాద ప్రణాళికలు వెయ్యటానికి అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం భోపాల్ సెంట్రల్ జైల్ లో ఉన్న డాక్టర్ గా పిలవడుతున్న ఫైజల్ ఇందోర్ లో హోమియోపతి కోర్స్ చేసినవాడు. సిమి సంస్థలో సఫ్దర్ నగోరి అరెస్ట్ తర్వాత సిమి నాయకత్వాన్ని చేపట్టాడతను. బాబ్రీ మస్జీద్ కేసులో తీర్పు నిచ్చిన జడ్జ్ లను హత్య చెయ్యటానికి ప్రణాళికవేసాడు, పోలీసుల మీద కాల్పులు జరిపాడు.
మాజీ సిబిఐ డైరెక్టర్ జోగీందర్ సింగ్ మాట్లాడుతూ, దేశంలో ప్రబలిపోతున్న ఉగ్రవాదాన్ని రూపుమాపటం కోసం మోదీ ప్రభుత్వం కఠినమైన చర్యలను చేపట్టాలని, ఇంతకు ప్రభుత్వంలాగా వోటు బ్యాంక్ పాలసీని చేపడితే దేశంలో ప్రజలందరికీ ఇబ్బందులు తప్పవని అన్నారు. అందువలన, మోదీ చాలా జాగ్రత్తగా ఉండటమే కాకుండా ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా కఠినతరమైన చట్టాలను తీసుకునిరావాలని, ఉగ్రవాదులను ఉక్కు పాదంతో అణచివేయాలని జోగీందర్ సింగ్ అన్నారు.
మొత్తానికి మోదీకి ఉగ్రవాదులనుండి ప్రమాదం పొంచివుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more