తెలుగు మాట్లాడే సోదరుల సంక్షేమం కోసం తమిళనాడులో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది.
ఆ తమిళనాడు తెలుగు మక్కల్ కచ్చి పేరుతో స్థాపించిన ఈ పార్టీ జెండాను పలు సంస్థల సమక్షంలో సోమవారం నాడు ఆ పార్టీ నాయకుడు ఎస్ రాందాస్ ఆవిష్కరించారు. తెలుగు మాట్లాడేవారి సంఖ్యాబలం లేకపోవటంతో వారిని చిన్నచూపు చూస్తున్నారని, వారి సంక్షేమాన్ని పట్టించుకోవటంలేదని, కానీ తమిళనాడు అభివృద్ధిలో వారి పాత్ర ఎంతో ఉన్నదన్న సంగతి విస్మరిస్తున్నారని ఆయన అన్నారు.
తమిళనాడులోని మూడు పార్టీలలోనూ తెలుగు నాయకులున్నా ఫలతం మాత్రం సున్నా అన్నారాయన. తెలుగువారి సమస్యలను పార్టీ ముందుకు తీసుకుని రమ్మని కోరారు రాందాస్. భాషాపరంగా తక్కువ సంఖ్యలో ఉన్నవారికి గుర్తింపు ఉండాలంటూ రాందాస్ మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజకీయంగా సోషల్ డెమాక్రటిక్ అలయెన్స్ తో పొత్తుపెట్టుకుంటామని కూడా తెలియజేసారు.
ఆ తర్వాత పార్టీలో 11 తీర్మానాలు జరిగాయి. ముఖ్యంగా తమిళనాడులో తెలుగు భాషను రాష్ట్రంలో రెండవ అధికార భాషగా చేస్తామని పార్టీ అధ్యక్షుడు సి.జె. రాజ్ కుమార్ అన్నారు. పిఎమ్కే నాయకత్వంలో నడిచే సోషల్ డెమాక్రటిక్ అలియన్స్ తో పార్టీ పొత్తు పెట్టుకుంటుందని తెలియజేసారు. మద్యం దుకాణాలను మూసివేయాలన్న పిఎమ్కే కి మద్దతుగా నిలుస్తామని కూడా అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more