బీహార్ మాజీ ముఖ్యమంత్రి, పశువులదాణా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ తను ప్రధాన మంత్రి అవదలచుకున్న కల ఇంకా చెరిగిపోలేదని తానిప్పటికీ ప్రధాన మంత్రి అవటానికి సిద్ధమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని మత కలహాలను రేపి విద్వేషాలను కలిగించే పార్టీలను రూపు మాపుతానని అన్నారాయన.
ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీల మీద తన వ్యతిరేకతను వెల్లడి చేస్తూ, నరేంద్ర మోదీని, అరవింద్ కేజ్రీవాల్ ని అడ్డుకోవటమే తన ధ్యేయమని చెప్పారు లాలూ ప్రసాద్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీలతో పొత్తుతో వచ్చే ఎన్నికలలో గెలుస్తామని, కాంగ్రెస్, రామ్ విలాస్ పాశ్వాన్ లతో కలిసి దేశంలో మత విరోధ శక్తలను ఎలా చిత్తు చేస్తామో చూద్దురుగాని అన్నారాయన.
థర్డ్ ఫ్రంట్ లో కలుస్తారా అని అడిగిన ప్రశ్నకు ఏమాత్రం కలవనని ఆయన సమాధానం ఇచ్చారు. ఎందుకంటే ధర్డ్ ఫ్రంట్ లో చేరేవారంతా ప్రధానమంత్రి పదవిని ఆశించేవారేనని చెప్పారాయన. అలాంటప్పడు ప్రధాని పదవి కోసమే కలలు కంటున్న తను ఎలా చేరతారన్నది మనం అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవలనుకుంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ తనకు పడ్డ జైలు శిక్షకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదన్నారు. తనని కావాలని రాజకీయంగా అనర్హుడిగా చెయ్యటం కోసం రాహుల్ గాంధీ ఆర్డినెన్స్ ని వ్యతిరేకించారనటం సరికాదన్నారాయన. అంటే లాలూ ప్రసాద్ ఉద్దేశ్యంలో తాను రాహుల్ గాంధీక సమవుజ్జీ అని, తన వలన ఆయన ప్రధాన మంత్రి కాలేకపోతాడని భయమన్నమాట!
అలాగని ఆర్డినెన్స్ ని పాస్ చెయ్యటం కూడా తనను కాపాడటం కోసం కాదని కూడా ఆయన అన్నారు.
నేరచరిత కలవారు ప్రజాప్రతినిధులుగా అనర్హులని సుప్రీం కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ని పాస్ చెయ్యగా కొన్ని రోజుల తర్వాత రాహుల్ గాందీ అది సరైన చర్య కాదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దానితో ఆ ఆర్డినెన్స్ ని కేంద్రం రద్దు చేసింది. అంటే సుప్రీం కోర్టు తీర్పే ప్రస్తుతం అమలులో ఉంది.
అలాంటప్పడు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాన మంత్రిగా అధికారాలు చేపట్టే కల చెదరలేదు అంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఇంకా నిద్ర లోంచి లేవలేదన్న మాట అంటూ ఒక రాజకీయ విశ్లేషకుడు చమత్కరించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more