Jairam ramesh flatters seemandhra people

Jairam Ramesh flatters Seemandhra people, Telangana Bill, Two chief ministers for AP, Kiran Kumar Reddy, GoM member Jairam Ramesh

Jairam Ramesh flatters Seemandhra people

సీమాంధ్రులను పొగడ్తలతో ముంచెత్తిన జైరాం రమేష్

Posted: 02/23/2014 08:30 AM IST
Jairam ramesh flatters seemandhra people

తెలంగాణా రాష్ట్రం కోసం ఏర్పడ్డ జివోఎమ్ లో ప్రధాన పాత్ర పోషించిన జైరాం రమేష్ సీమాంధ్రులను ఈ విధంగా పొగడ్తలతో ముంచెత్తారు-

సీమాంధ్ర ప్రజలు కష్టజీవులు, కృషీవలురు, మేధావులు, శక్తిమంతులు, విద్యావంతులు, వ్యాపార వాణిజ్యాలలో యాజమాన్య స్పూర్తిలో ముందున్నవారు, పెద్ద పెద్ద కాంట్రాక్టులను చెయ్యగల సమర్థులు.  ఐదు సంవత్సరాలలో దేశంలోనే అతి సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దగలవారు.

ఉన్నట్టుండి జైరాం రమేష్ కి సీమాంధ్రుల మీద ఇంత అభిమానం ఎందుకు పొంగుకువచ్చిందా అంటే, రాష్ట్ర విభజన వలన నష్టపోయినా దాన్ని పూరించుకునే అవకాశాలు, సామర్థ్యం ఉంది కాబట్టి హైద్రాబాద్ ఆదాయం లేకపోయినా నెగ్గుకు వస్తారనటంలో ఆయనకు ఎటువంటి సందేహమూ లేదట. 

అయితే, లోక్ సభలో గందరగోళం వలన సీమాంధ్రవాసులకు హామీలు ఏమీ ప్రకటించలేకపోయారట.  రాజ్యసభలో వాటి ప్రస్తావన తెద్దామనే అనుకున్నారట కానీ ఇంతలో భాజపా తరఫునుంచి వెంకయ్య నాయుడు వాటిని చర్చలోకి తీసుకుని వచ్చారట.  అందరం చర్చించుకుని నిర్ణయానికి వచ్చిన అంశాలనే రాజ్యసభలో వెంకయ్య నాయుడు లేవనెత్తారని జైరాం రమేష్ అన్నారు. 

రాష్ట్ర విభజన ఆలస్యమవటానికి కారణం కిరణ్ కుమార్ రెడ్డేనని, ఆయన ఇరు ప్రాంతాలలో విద్వేషాలను రేపటం జరిగిందని, ఇప్పటికైనా రాజీనామా చేసి మంచి పని చేసారని అన్న జైరాం రమేష్ త్వరలో ఇద్దరు ముఖ్యమంత్రులను రాష్ట్రానికి పంపిస్తున్నాం అని తెలియజేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles