Seemandhra mps suspended by speaker

Seemandhra MPs suspended by speaker, Speaker suspends Seemandhra MPs, Lagadapati Rajagopal, Modugula Venugopal Reddy

Seemandhra MPs suspended by speaker

పార్లమెంట్ నుండి సీమాంధ్ర ఎంపీల బహిష్కరణ

Posted: 02/13/2014 02:23 PM IST
Seemandhra mps suspended by speaker

పార్లమెంట్ లో చేసిన అల్లర్ల దృష్ట్యా స్పీకర్ మీరా కుమార్ తెలంగాణా, సీమాంధ్ర నేతలను సస్పెండ్ చేస్తూ సభను 3 గంటలకు వాయిదా వేసారు.

ఈ రోజు జరిగిన సంఘటన దేశ పార్లమెంటుకే మాయని మచ్చని స్పీకర్ మీరా కుమార్ అన్నారు.  మన పార్లమెంటు వ్యవస్థకు ప్రపంచంలో మంచి పేరుందని అది కాస్తా మంటకలిసిపోయిందన్నారామె.  పార్లమెంటులో జరిగిన గందరగోళం తనకి తీవ్రమైన మనస్తాపాన్ని కలిగిస్తోందన్నారు మీరా కుమార్. 

సస్పెన్షన్ కి గురైన సీమాంధ్ర ఎంపీలు –

లగడపాటి రాజగోపాల్, అనంత వెంకటరామిరెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఎస్ పి వై రెడ్డి, సబ్బం హరి, హర్ష కుమార్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, రాయపాటి సాంబశివరావు, కొనకళ్ళ నారాయణరావు, నిమ్మల కిష్టప్ప, సాయి ప్రతాప్, మేకపాటి రాజమోహన రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎన్ శివప్రసాద్,

సస్పెన్షన్ కి గురైన తెలంగాణా ఎంపీలు-

గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్

ఈ రోజు పార్లమెంట్ చరిత్రలోనే చీకటి రోజని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి పార్లమెంటు దగ్గర మీడియా ప్రతినిధులతో అన్నారు.  తెలంగాణా ఎంపీలు తనపై దాడి చేసారని,  మార్షల్స్ తో కూడా తన మీద దాడి చేయించారని ఆయన ఆరోపించారు.  ఈ రోజు జరిగిన సంఘటనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన అన్నారు.  వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ఎంపీలు తన మీద దాడి చేసారని మోదుగుల అన్నారు.  తను మైకు తీసుకున్న మాట నిజమే కానీ పార్లమెంటులోకి కత్తిని తీసుకుని రాలేదని ఆయన అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles