సామాన్యుడికి దూరమైన కేజ్రీవాల్
అర్ధాంతరంగా కేజ్రీవాల్ జనతా దర్భార్ ను మూసివేశాడు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమంటూ చేపట్టిన జనతా దర్బార్ మూసి వేయడంతో పాటు తానే స్వయంగా ప్రజలను కలుసుకోనున్నట్లు ప్రకటించారు. దీని నిర్వహణకు ఆటంకాలు ఏర్పడుతున్నందున దీనిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రజల ఫిర్యాదులను ఆన్ లైన్లో తీసుకోనున్నట్లు వెల్లడించారు.
ఈ నిర్ణయంపై జనం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి తమ సమస్యలను నేరుగా వింటారని భావించిన జనాలు దీనిపై పెదవి విరుస్తున్నారు. పైగా దీనికి తగిన వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. ఇదిలాఉంటే కేజ్రీవాల్ తొలిసారిగా ఢిల్లీలో నిర్వహించిన ప్రజాదర్బార్ రసాభాసగా మారింది. వేలమంది జనం ఒకేసారి వెల్లువలా రావడం, ఆపై వారిని నియంత్రించేవారు కరువవడంతో సభాస్థలిలో తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఈ దదిమిలా తీవ్ర గందరగొళం చెలరేగింది. దీంతో కేజ్రీవాల్ వారం రోజుల్లోగా తిరిగి జనతా దర్బార్ ను నిర్వహిస్తామని చెప్పి తప్పించుకున్నారు. అయితే కేజ్రీవాల్ నిర్ణయం పై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. సామాన్యుడి పార్టీ అంటూ ప్రజల్లోకి వచ్చిన కేజ్రీ వాల్ ఇలా చేయడం జనాలకు మింగుడు పడడం లేదు. ఇది కూడా అన్ని పార్టీల్లానే తమను నమ్మించి మోసం చేస్తున్నదని వాపోతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more