పాకిస్తాన్ లో జరిగిన సంఘటన చూస్తే అమెరికా ప్రభుత్వం ఏం చేసినా అది చెల్లిపోతుంది కానీ వేరే ఎవరూ చెయ్యగూడదన్న వాళ్ళ వాదన అర్థమౌతుంది.
అది 2011 వ సంవత్సరం, తేదీ జనవరి 27. రేమాండ్ అల్లెన్ డేవిస్ అనే అతను లాహోర్ లో ఇద్దరు సాయుధ పోలీసులను కాల్చి చంపాడు. అతనేమీ దేవయాని హోదా అయిన డెప్యూటీ కాన్సుల్ జనరల్ కి తగినవాడేమీ కాదు. కేవలం ఒక ప్రైవేట్ కంపెనీ లో పనిచేస్తూ పాకిస్తాన్ లో అమెరికా ప్రభుత్వపు సిఐఏ తరఫున చేసిన పని అది. డేవిస్ ఉపయోగించిన వాహనంలో లభించిన ఎన్నో పేర్లతో అతని ఐడి కార్డ్ లు, కెమేరాలోని వివిధ ఫొటోల వలన అతను ఒక అమెరికన్ గూఢచారి అని బయటపడ్డా, మసి పూసి మారేడు కాయ చేసినట్లుగా, అతనికి దౌత్యహోదా కల్పించి, పాకిస్తాన్ కోర్టుకి ఆ కేసు పోకుండా కట్టుదిట్టం చెయ్యగల దిట్టలు అమెరికన్ అధికారులు. స్థానికంగా వచ్చిన వ్యతిరేకతను సైతం ఎదుర్కొని 2.4 డాలర్లను కక్కి డేవిస్ ని విడిపించుకొచ్చారు. దరిమిలా ఆ చనిపోయినవాళ్ళ కుటుంబ సభ్యులుకూడా మాయమైపోయారు.
మరో సందర్భంలో కెన్యాలో పనిచేసే తక్కువ స్తాయి అమెరికన్ దౌత్యవేత్త జోషువా వాల్డేని కూడా అలాగే రక్షించి తీసుకొచ్చారు. వాల్డే తను నడుపుతున్న ఎస్ యు వి తో ముందు వెళ్తున్న బస్ ని ఢీకొనగా ఒక మనిషి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. చనిపోయిన మనిషి కుటుంబ సభ్యులకు కనీసం పరిహారం కూడా చెల్లించకుండా దౌత్యవేత్తలకు లభించే మినహాయింపుని ఉపయోగించుకున్నారు.
అమెరికన్ వాసులు విదేశాలలో ఏం చేసినా సరే వాళ్ళను సగౌరవంగా తమ దేశానికి తిరిగి తెచ్చుకుంటారు. విదేశీయులు తమ దేశస్తులను కోర్టు విచారణకు తీసుకెళ్ళనివ్వరు. అమెరికన్ దౌత్యవేత్తలకు మాత్రమే ఇతర దేశాలలో నిబంధనలు వర్తించవన్నమాట. ఇతర దేశాల దౌత్యవేత్తలకు మాత్రం వాళ్ళ దేశంలోని చట్టాలు వర్తిస్తాయి.
అమెరికా ఏదో శరణార్థుల శిబిరమైనట్లు, భారత దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళే వాళ్ళ మీద ఎటువంటి జులుంనైనా చెయ్యవచ్చన్నది అమెరికా భావన. దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులే కాదు సాధారణ నాగరికులను సైతం వదిలిపెట్టరని షారుఖ్ ఖాన్ ని సెక్యూరిటీ చెక్ లో వేధించిన సంఘటనతో రుజువౌతుంది.
నిదానంగా సాత్వికంగా పోయే భారత ప్రభుత్వమన్నా భారతదేశ వాసులన్నా అమెరికాకు చులకనే అని ఈ సంఘటనల ద్వారా తెలుస్తోంది.
దేవయాని విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుతో భారత దేశవాసులు, కొందరు రాజకీయ నాయకులు స్పందించినా, ఢిల్లీ లో అమెరికన్ దూతావాసం ముందు ఉన్న బ్యారికేడ్లను తొలగించినా, వెంటనే చప్పబడ్డ మన ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, అమెరికా దేశంతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఆలోచించి దేవయాని విషయంలో పరిష్కార మార్గం కనిపెట్టాలని అనటం చేతకాని తనం అనిపించుకుంటుంది కానీ సాత్వికం అని మాత్రం అనిపించుకోదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more