అవును.. శ్రీవారి భక్తులు ప్రతిరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలిపారు. తిరుమల కొండకు వచ్చే శ్రీవారి భక్తులు .. తల్లి, పిల్ల కాంగ్రెస్ తో చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తించారు. తిరుపతి కొండపైన ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించరాదని నిబంధన ఉన్నప్పటికి తల్లి కాంగ్రెస్ నేతలు, పిల్ల కాంగ్రెస్ నాయకులు సమావేశాలు పెట్టి, భక్తులను అపవిత్రం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరుమల కొండపై చేసిన రాజకీయ సమావేశం పై.. గాలి తీవ్రంగా మండిపడుతున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఆయనే నిబంధనలు పాటించకుంటే సామాన్యులు పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజలు మౌనంగా ఉంటే కొండపైన కాంగ్రెస్పార్టీ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసుకొనేందుకు పిల్ల, తల్లి కాంగ్రెస్లు వెనుకాడవన్నారు. పైసాపైసా కూడబెట్టి, కాలినడకన తిరుమలచేరే భక్తు లకు అడగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల కష్టాలు పట్టించుకోకుండా కొండపై రాజకీయ పెత్తనం చేయటానికి ప్రయత్నించటం సిగ్గుచేటని, తల్లి, పిల్ల కాంగ్రెస్ చేష్టలు భగవంతుడికి, భక్తులకు దూరం పెంచేయిలా ఉన్నాయని తెలిపారు.
ఆగమ శాస్త్రానికి విరుద్దంగా శ్రీవారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలను తీసుకువెళ్ళి తిరుపతి విమానాశ్రయంలో సోనియాకు అందచేసి, గతంలో ప్రజల ఆగ్రహానికి కాంగ్రెస్ నేతలు గురయ్యారన్నారు. అయినా నేతల తీరులో ఎలాంటి మార్పులేదని ఆయన విమర్శించారు. సీఎం వ్యక్తిగత సహాయకుడితో సహా, ఆయన పేషీలోని అనేకమంది అధికారులు యధేచ్చగా టిక్కెట్లు సిఫారసు చేయటం, టిక్కెట్ కొనకుండానే సేవల్లో పాల్గొనటం కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీగా మారిందన్నారు. సామాన్య భక్తులకు ఇంటర్నెట్లో అర్చన, అభిషేకం లాంటి టిక్కెట్లు దశాబ్ధాలపాటు దొరకని పరిస్థితిని కాంగ్రెస్ నేతలు సృష్టించారని ఆయన మండిపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more