శీతాకాల సమావేశాలు సమీపిస్తుండటంతో రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుంది. సీడబ్ల్యూసీ తీర్మానంలో పదేళ్ళ పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ళ పాటు ఉంటుందని ప్రకటించిన తరువాత తెలంగాణ ప్రాంత నేతల నుండి తీవ్రమైన వ్యతిరేకత రావడం జరిగింది.
తాజాగా కేంద్రం హైదరాబాద్ ను రెండేళ్ళ పాటు యూటీ చేసి ప్రస్తుతం ఉన్న సమస్యల నుండి గట్టెక్కాలనే ఆలోచనలో అధినేత్రి సోనియా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయం పై ఆమె నిశితంగా పరిశీలిస్తోంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధినంతటినీ రెండేళ్ల పాటు యూటీ చేసే విషయంపై తలెత్తే ఇబ్బందులేమిటో తెలుసుకుని, వాటిని అధిగమించేందుకు తగిన ప్రతిపాదనలు చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అత్యవసరంగా భేటీ అయిన సమావేశంలో సూచించింది.
ఇక ఇటు సీమాంధ్ర కేంద్ర మంత్రులు అయిన జేడీ శీలం, కావూరి సాంబశివరావు లాంటి వాళ్ళు హైదరాబాద్ ను తాత్కాలిక యూటీ చేస్తే పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామని, సీమాంధ్ర మంత్రుల్ని ముఖ్యమంత్రి కిరణ్ ని కూడా విభజనకు ఒప్పిస్తామని కూడా అంటుండటంతో కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తుంది. మరి ఈ ప్రతిపాదనకు తెలంగాణ వాదులు ఒప్పుకుంటారో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more