2008 మే 16న ఆరుషి అనే 13 ఏళ్ల బాలిక తన గదిలోనే మంచంపై హత్యకు గురయింది. పదునైన ఆయుధంతో గొంతు కోసి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె హత్యానంతరం కనపడకుండా పోయిన వారి పనిమనిషి హేమరాజ్ ఈ హత్య చేసి ఉంటాడని తొలుత భావించారు, అయితే ఆ మార్నేడే అదే భవనంలో హేమరాజ్ మ్రుతదేహం కూడా లభించింది.
దీంతో అనుమానం ఆరుషి తల్లిదండ్రుల పైకి మళ్లింది. వారిద్దరు డాక్టర్లు కావడం, హత్య జరిగిన తీరు అ అనుమానాన్ని బలపరచడంతో పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. ఆరుషి వారి ఏకైక సంతానం . అయితే ఈ కేసు సిబిఐ చేతికి వెళ్లింది. దీంతో ఈ కేసు చివరకు పలు మలుపులు తిరిగి ఎట్టకేలకు ఈ రోజు తీర్పు వెలువడింది.
ఆరుషి, హేమరాజ్ జంట హత్యల కేసులో్ ఘజియాబాద్ సిబిఐ కోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. ఆరుషి తల్లిండ్రులైన నూపుర్, రాజేష్ తల్వార్లనే న్యాయస్థానం దోషులుగా తేల్చింది. వీరికి రేపు శిక్ష ఖరారు చేయనుంది. ఈ కేసు ఐదేళ్ల తర్వాత తీర్పు వెలువడింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more