రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదిగా.. హైకమాండ్ తో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి , కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసుకోవటం.. రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. తెలంగాణ బిల్లు ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కి.. జైపాల్ రెడ్డి పై ఎత్తులు వేస్తూ.. సోనియా గాంధీని కలిసినట్లు తెలుస్తోంది. అయితే 371 (డి)కి రాజ్యాంగ సవరణ అవసరం లేదని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
శీతాకాల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ బిల్లు గట్టెక్కించే విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుదని అన్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయరాదని, ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలని జైపాల్రెడ్డి సోనియా గాంధీని కోరినట్లు సమాచారం.
అలాగే భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలనే ప్రతిపాదనతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తుంది. కాగా జీవోఎం సిఫార్సులు ఖరారు అవుతున్న నేపథ్యంలో ఆయన సోనియాతో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ బిల్లు విషయం హైకమాండ్ చూసుకుంటుందని జైపాల్ రెడ్డి చెప్పటంతో.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తే .. నరికేద్దాం అన్నట్లుగా ఉన్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more