Jaipal reddy meets sonia gandhi over telangana

Jaipal Reddy meets Sonia Gandhi over Telangana, Jaipal Reddy, telangana issue, cm kiran kumar reddy, congress party, telangana leaders, telangana bill,

Jaipal Reddy meets Sonia Gandhi over Telangana

అంత హైకమాండ్ చూసుకుంటుంది : జైపాల్ రెడ్డి

Posted: 11/25/2013 03:33 PM IST
Jaipal reddy meets sonia gandhi over telangana

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదిగా.. హైకమాండ్ తో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి , కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసుకోవటం.. రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. తెలంగాణ బిల్లు ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కి.. జైపాల్ రెడ్డి పై ఎత్తులు వేస్తూ.. సోనియా గాంధీని కలిసినట్లు తెలుస్తోంది. అయితే 371 (డి)కి రాజ్యాంగ సవరణ అవసరం లేదని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 

శీతాకాల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ బిల్లు గట్టెక్కించే విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుదని అన్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయరాదని, ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలని జైపాల్‌రెడ్డి సోనియా గాంధీని కోరినట్లు సమాచారం.

 

అలాగే భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలనే ప్రతిపాదనతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తుంది. కాగా జీవోఎం సిఫార్సులు ఖరారు అవుతున్న నేపథ్యంలో ఆయన సోనియాతో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ బిల్లు విషయం హైకమాండ్ చూసుకుంటుందని జైపాల్ రెడ్డి చెప్పటంతో.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తే .. నరికేద్దాం అన్నట్లుగా ఉన్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles