తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు, ఆ పార్టీ సెక్రెటరీ జనరల్ కె.కేశవరావు ఢిల్లిలో అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిసి రహస్య చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో మరో చర్చకు తెరలేపింది. రాష్ట్ర విభజన అనంతరం సమస్యలు, పరిష్కారాల కోసం కేంద్ర మంత్రుల బృందం ఐదు పార్టీలతో సమావేశాలు నిర్వహించింది. అయితే సాయంత్రం అన్ని పార్టీలు అభిప్రాయం చెప్పిన తర్వాత జీవొఎంలోని సభ్యులు ఆంటోనీ, జైరాం రమేష్ వంటివారందరూ వెళ్ళి పోయాక కేసీఆర్, కేకేలు 20 నిమిషాలపాటు షిండేతో చర్చలు జరిపారు.
అయితే ఇటీవల కాలం లో కాంగ్రెస్ పార్టీలో తెరాస విలీనం ఉండదని వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోరు చేస్తామంటూ పార్టీ అంతర్గత సమావేశాల్లో కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ మాట మార్చారు. కాంగ్రెస్లో విలీనం కాదంటూ చేస్తున్న ప్రకటనలపై మీడియా అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ స్పందిస్తూ ఏవో పత్రికలు ఏవో రాసుకుంటే నేను బాధ్యుడినా అంటూ ఎదురు ప్రశ్న వేశారు.
దీంతో షిండేతో సమావేశమైన సందర్భంగా తెరాస ఇటీవల వ్యవహరిస్తున్న తీరుపైనే చర్చ జరిగినట్టు తెలిసింది. తెరాస తమ పార్టీలో విలీనమైతేనే రాష్ట్ర ఏర్పాటుకు తాము ముందుకు వచ్చామని, ఇప్పుడు మాట మారిస్తే ఎలా అంటూ షిండే కేసీఆర్ను ప్రశ్నించినట్టు తెలిసింది. దీనికి కెసిఆర్ కూడా సుదీర్ఘమైన వివరణ ఇచ్చినట్టు సమాచారం. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి నిత్యం విలీన అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వారి మాటలను తిప్పికొట్టేందుకే అలా మాట్లాడాల్సి వస్తుందని వివరణ ఇచ్చినట్టు సమాచారం.
హైదరాబాద్లో నివసిస్తున్న సీమాంధ్రులలో ఎటువంటి భయాందోళనలు లేవని, కేవలం కొంతమంది నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ భూతద్దంలో చూపుతున్నారని హైదరాబాద్పై ఎటువంటి ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కేసీఆర్ షిండేకు చెప్పినట్లు సమాచారం. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేస్తేనే ప్రజలు, తాము ఒప్పుకుంటాం తప్ప మరే ప్రత్యామ్నాయానికి అంగీకరించేది లేదని కేసీఆర్, హోంమంత్రికి స్పష్టం చేసినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more