We will selling volvo bus two years ago jc travels

we will selling volvo bus two years ago jc travels, 42 charred to death as bus catches fire in AP, Mahabubnagar bus accident, bus fire, Kothakota bus accident, Volvo Bus Accident in Mahbubnagar, jC Travels,

we will selling volvo bus two years ago jc travels, 42 charred to death as bus catches fire in AP

కాలిన వోల్వో బస్సుతో జేసీ ట్రావెల్స్ సంబంధం ఉందా?

Posted: 10/30/2013 11:14 AM IST
We will selling volvo bus two years ago jc travels

మహభూబ్ నగర్ జిల్లో ప్రమాదానికి గురైన వోల్వో బస్సు తో అనంతపురం జేసీ ట్రావెల్స్ సంబంధం ఉందా? అనే అనుమానాలు రావటంతో జరుగుతుంది. అయితే ఈవిషయం తెలుసుకున్న జేసీ ట్రావెల్స్ యాజమాన్యం వెంటనే స్పందించి వోల్వో బస్సు వివరాలను తెలపటం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన వోల్వో బస్సుతో తమ ట్రావెల్స్ కు ఎలాంటి సంబంధం లేదని జేసీ ట్రావెల్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. తాము రెండేళ్ల క్రితమే బస్సును అమ్మివేసినట్లు యాజమాన్యం తెలిపింది. జబ్బర్ ట్రావెల్స్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని... అయితే టైటిల్ మార్చకపోవటం వల్లే తమ ట్రావెల్స్ పేరు ఉందన్నారు.

 

ప్రమాదం జరిగిన జబ్బార్‌ బస్సు (AP 02 TA 0963) దివాకర్‌ ట్రావెల్స్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ అయింది. అయితే ఈ బస్సును 2010 అక్టోబర్ లో విక్రయించినట్టుగా ఆర్టీఏ రికార్టులు చెబుతున్నాయి. అయితే జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్ట్రర్ అయిన బస్సు....జబ్బర్ ట్రావెల్స్ పేరుతో ఎందుకు నడుస్తుందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

 

మరోవైపు ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.కాగా ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 49 మంది ప్రయాణీకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో 42 మంది అగ్నికి అహుతైపోయారు. ప్రమాదం జరిగే సమయంలో ప్రయాణీకులు గాఢ నిద్రలో ఉన్నారు. వారంతా నిద్రలోనే మృత్యువడికి చేరుకున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles