డ్రైవర్ నిక్ష్యానికి బస్సు ప్రమాదంలో నిద్రలో ఉన్న వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మహబూబ్నగర్ జిల్లాలో కొత్తపేట మండలం పాలెం ఎన్హెచ్ 44పై వోల్వో బస్సు ఘోర ప్రమాదానికి గురవ్వడంతో 45 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యిఉంటారని సమాచారం అందుతుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన ఏపీ 02 పీఏ 0963 నంబరు బస్సు వేగంగా వచ్చి డివైడర్ ను డీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు.
బస్సు డివైడర్ ని డీకొట్టగానే డీజీల్ ట్యాంకర్ పేలడంతో బస్సు వెనక భాగంలో భారీగా మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. ఇందులో మొత్తం 49 మంది ప్రయాణికులు ఉండగా నలుగురు మాత్రమే ప్రాణాలతో బయట పడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో అందరు గాఢ నిద్రలో ఉండటంతో ఈ ప్రమాదం నుండి తప్పించుకోక పోయినట్లు చెబుతున్నారు. ప్రయాణీకుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లి పోయింది. గాయపడిన వారికి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ క్లీనర్ తో పాటు మరో ఇద్దరు ముగ్గురు ప్రాణాలతో బయట పడ్డారు.
బస్సు డ్రైవర్ క్లీనర్ పరారీలో ఉన్నారు. బస్సు ప్రమాదంలో నుండి బయట పడిన ఐదురుగు ప్రయాణీకులు శ్రీకర్ (హైదరాబాద్) రాజేశ్ (హైదరాబాద్) జైసింగ్(ఉత్తర ప్రదేశ్ ) మజహర్ బాషా (బెంగుళూరు) జోగోష్ (బెంగుళూరు) అక్కడి వనపత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందవలసి ఉంది.
ఈ ఘటన పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. సంఘటన స్థలాన్ని మంత్రి డీకే అరుణ సందర్శించి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. మరణించిన వారి వివరాల కోసం కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more