రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంద్ర కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన ఇంటి వద్ద దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం విషమించటంతో.. భారీ బలగాల మద్య జగన్ దీక్ష ను నిమ్స్ కు చేర్చటం జరిగింది. ఆరోగ్యం విషమించటంతో వైద్యుల సలహా మేరకు అర్థ రాత్రి పోలీసులు రంగప్రవేశం చేసి జగన్ను ఆసుపత్రికి తరలించారు. రక్తపోటు, సుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గడంతో ఆయన దీక్షా వేదికపైనే సొమ్మసిల్లారు. శరీరంలో కీటోన్లు 4 ప్లస్గా వృద్ధిచెందినట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స నిర్వహించక పోతే శరీర అవయవాలు దెబ్బతినటంతో పాటు అపస్మారక స్థితిలోకి చేరే ప్రమాదముందని హెచ్చరించారు.
తక్షణమే ఫ్లూయిడ్స్ ఎక్కించాలని సూచించారు. దీనికితోడు ఆయన వెన్ను, నడుము నొప్పితో బాధపడుతున్నారు. దీంతో పోలీసులు బలవంతంగా ఆయన్ను ఆసుపత్రికి తరలించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పోలీసులు, వైకాపా నేతల మధ్య వాగ్వాదం జరిగింది. జగన్ను ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు చెదరకొట్టారు. విస్తృత బందోబస్తు నడుమ ఆయన్ను రాత్రి 11.30 గంటల సమయంలో నిమ్స్కు తరలించారు. అత్యవసర విభాగంలో ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. జగన్ ఆరోగ్య పరిస్థితిపై పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి భారతి తండ్రి గంగిరెడ్డి వైద్యులనడిగి తెలుసుకున్నారు. అయితే జగన్ చికిత్సకు నిరాకరించి ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more