రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కోపం వచ్చింది.... ఆయనకు సీమాంధ్ర నేతల నుండి ఎదురైన అనుభవం మనస్థాపాన్ని కలిగిందచింది. ఓ దశలో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని కూడ అనుకున్నారు . రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో భాజాపా రాష్ట్ర కిషన్ రెడ్డి అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం జరిగింది. దీనికి పార్టీ నాయకులు ఇంద్రసేనారెడ్డి, యెండెల లక్ష్మినారాయణ, వి. రామారావు, శేషగిరిరావు, శాంతారెడ్డి, సురేష్ రెడ్డి, సోము వీర్రాజు , రవీంద్రరాజు పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమం, పార్టీ తీరు పై వస్తున్న విమర్శలు, పార్టీ కార్యాలయాల పై జరుగుతున్న దాడులను వివరించడానికి జాతీయనేతలతో చర్చించడానికి ఢిల్లీ వెళ్లడానికి ప్లాన్ చేశారు.
దీనికి సంబంధించిన అంశం పై, మొన్న సకల జనభేరిలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై సీమాంధ్ర ప్రాంత నాయకులు కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.. ఆంధ్రోళ్లంతా తెలంగాణ ద్రోహులే' అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సీమాంధ్ర నేతలు మండిపడ్డారు. "తెలంగాణకు అనుకూలంగా బీజేపీ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. సీమాంధ్రలో పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నా, పార్టీ సమావేశాలను అడ్డుకుంటున్నా.. భౌతిక దాడులకు పాల్పడుతున్నా.. పార్టీ నిర్ణయాన్ని ఎదిరించలేదు. ఆంధ్రోళ్లంతా ద్రోహులే అని విమర్శిస్తుంటే పార్టీ నేతలు ఎందుకు ఖండించలేదని నిలదీశారు.
అలాంటి నేతతో భవిష్యత్తులో వేదికను పంచుకోవద్దని కరాఖండిగా తేల్చి చెప్పారు. సీమాంధ్రులు తమ పై వ్యక్తం చేసిన అసంత్రుప్తికి ఓ దశలో తీవ్ర ఆవేదనకు గురయ్యి , మీరు పరిస్థితులను అర్థం చేసుకోవడం లేదంటూ పార్టీని మీరే నడుపుకోండి అంటూ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. మొత్తానికి కమలం కోర్ కమిటీ భేటి వేడి, వేడిగా జరిగినట్లు చెబుతున్నారు. .
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more