ప్రముఖ బాలీవుడ్ నటుడు, దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత, పద్మభూషన్ గ్రహీత అయిన ప్రాణ్ (93) శుక్రవారం రాత్రి లీలావతి ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను మూడు వారాల క్రితం ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుండి ఆయనను వెంటిలేటర్ పైనే ప్రాణ్ నిన్న రాత్రి తుది శ్వాస విడిచాడు. ఈయన అసలు పేరు ప్రాణ్ కిషన్ సికంద్. 1940 లో సినిమా కెరియర్ ప్రారంభించిన ప్రాణ్ 400 పైగా సినిమాల్లో నటించాడు. అటు బాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రాణ్ సుపరిచితం. 1920, ఫిబ్రవరి 12న పాతఢిల్లీలోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి లాలా కేవల్ కిషన్ సికంద్ సివిల్ ఇంజనీర్, ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టర్. తల్లి రామేశ్వరి. ప్రాణ్ కిషణ్ కి ఇద్దరు కుమారులు ఉన్నారు. 1986లో విడుదలైన తాండ్ర పాపారాయుడు సినిమాలో బుస్సీ దొరగా, 1990లో వచ్చిన కొదమసింహం సినిమాలో మేయర్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను అలరించారు.
1960, 70ల్లో విడుదలైన భారీ బడ్జెట్ హిందీ సినిమాలన్నిటిలోనూ ఆయన నటించారు. ఆయన కెరీర్లో మిలాన్, మధుమతి, కశ్మీర్ కీ కలి వంటి క్లాసిక్స్ ఉన్నాయి. జంజీర్, డాన్, అమర్ అక్బర్ ఆంటోనీ, వంటి బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి మేటి విలన్ గా పేరు తెచ్చుకున్నారు. 1990 తరువాత ఆరోగ్యం సహకరించిక వెండితెరకు దూరం అయ్యారు. 2000 సంవత్సరంలో స్టార్ డస్ట్ పత్రిక ఆయన్ను 'విలన్ ఆఫ్ ద మిల్లీనియం'గా అభివర్ణించింది. సీఎన్ఎన్ ప్రకటించిన ఆసియాలో టాప్ 25 నటుల జాబితాలో ప్రాణ్ కూడా ఉన్నారు. 2001లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్తో గౌరవించింది. కాగా ప్రాణ్ మృతి పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ,సినీప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more