మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ. వివాదం అంతా 26 జీవోల చుట్టే తిరుగుతోందని, ఆ అవసరం ఏమిటో చంద్రబాబు చెప్పాలని ఆయన అన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తనపై బురద చల్లి తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఓ జీవోతోనూ తనకు సంబంధం లేదని, నెంబర్ 12 జీవోతో తనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తనపై అసత్య ప్రచారం సాగిస్తున్నారని ఆయన అన్నారు. తనపై బురద చల్లుతున్నవారికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.
కళంకిత మంత్రులంటూ తన పేరు కూడా ఎందుకు చేరుస్తున్నారని ఆయన చంద్రబాబును అడిగారు. జగన్ ఆస్తుల కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంపై, తనపై ఆరోపణలు చేయడంపై మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి శంకరరావు పిటిషన్లో 60 జీవోల ప్రస్తావన ఉందని, అవన్నీ వదిలేసి 26 జీవోలపైనే చంద్రబాబు ఎఁదుకు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
రాంకీపై సిబిఐ దర్యాప్తు పూర్తి చేసిందని, తన పేరు అందులో రాలేదని ఆయన చెప్పారు. చంద్రబాబు ముద్దాయిగా ఉండి, స్టే తెచ్చుకున్నారని, అటువంటి చంద్రబాబుకు తనపై మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మంత్రిగా తన బాధ్యత నిర్వహించానని, ఆ విషయాన్ని కోర్టు తేలుస్తుందని, ఆ వ్యవహారంలో తన విషయాన్ని తమ పార్టీ అధిష్టానం పెద్దలు, ముఖ్యమంత్రి చూసుకుంటారని ఆయన చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more