Political chandra babu padayatra ending ceremony

babu padayatra ending ceremony, telugu desam party, chandra babu naidu, lokesh, balakrishna, padayatra ending at vizag, andhra university engg college compound

political chandra babu padayatra ending ceremony

padayatra-ending.png

Posted: 04/27/2013 09:42 AM IST
Political chandra babu padayatra ending ceremony

ఈరోజు విశాఖపట్నంలో పాదయాత్రను ముగిస్తున్న సందర్భంగా విశాఖపట్నం శివాజీపాలెం సమీపంలో అంగనంపూడి టోల్ గేట్ వద్ద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజయస్తూపాన్ని ఆవిష్కరిస్తారు.  అక్కడినుండి ముగింపు వేడుకకు ముస్తాబైన వాల్తేరు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానం వరకు ర్యాలీ నిర్వహిస్తారు.  అందులో ద్విచక్ర వాహనాలతోపాటు కార్లు, జీపులు మొత్తం పదివేలకు పైగా వాహనాలుంటాయి. 

ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరవబోతున్నారు.  పలు ప్రాంతాలనుంచి పార్టీ కార్యకర్తలు హాజరవటం కోసం విశాఖకు 11 ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసారు.  విజయవాడ నుంచి 700 ప్రత్యేక బస్సులు, ఇతర ప్రాంతాల నుంచి 1000 బస్సులను కూడా విశాఖకు వేసారు. 

ఫ్లెక్సీల్లో సంస్థాపక ఎన్టీఆర్ ఫొటో ఎలాగూ ఉంటుంది, ప్రస్తుత పార్టీ అధ్యక్షుడి ఫొటో కూడా ఉండాల్సిందే.  వాటితో పాటు చంద్రబాబు కుమారుడు లోకేష్ ఫొటోను కూడా కార్యకర్తలు అభిమానంతో వేసారు.  హీరో బాలకృష్ణ ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. 

విజయ స్తూపం ఆవిష్కరించిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రత్యేక వాహనం మీద ప్రధాన స్థలాల మీదుగా రెండు గంటలపాటు పర్యటిస్తూ వేడుకలు జరిగే వేదికకు చేరుకుంటారు.  ఈ లోపులో 2 గంటల నుంచి 4 గంటల వరకు ముఖ్యనేతల ప్రసంగాలుంటాయి.  చంద్రబాబు నాయుడు చేరుకోగానే ఆయన ప్రసంగం ఉంటుంది. 

63 సంవత్సరాల వయసులో రోజుకి సగటున 14 – 15 కిలోమీటర్లు 200 రోజుల పాటు నడిచి అన్ని వయసుల వారూ అన్ని వృత్తులవారినీ పలకరిస్తూ వారి కష్టసుఖాలను విచారిస్తూ, వారికి నేనున్నానని, నేను పాదయాత్ర చేసిందే మీకోసమని చెప్తూ ముందుకు సాగిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర ముగింపు వేడుకను అత్యంత వైభవంగా చెయ్యటానికి పార్టీ నడుంకట్టింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles