విద్యుత్ ఛార్జీల పెంపు కి ప్రభుత్వం పట్ల నిరసన ప్రకటిస్తూ ఓల్డ్ ఎమ్మల్యే క్వార్టర్స్ లో నిరాహార దీక్ష చేస్తున్న వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యలను అర్ధరాత్రి పోలీసులు దీక్షాభంగం చేసారు.
తేదీ దాటటమే కాకుండా అర్ధరాత్రికి మరో ప్రత్యేకత ఉంది. అందరూ నిద్రించే సమయం కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది, ప్రతిఘటనలను కోరుకోదు. ఏం జరుగుతోందో తెలిసేటప్పటికే పరిస్థితి చెయిదాటిపోతుంది. అందువలన అలాంటి సమయం పోలీసులకు అనువుగా ఉంటుంది. వాళ్ళని తరలించటానికి ట్రాఫిక్ అడ్డంకులేమీ ఉండవు. చల్లపూట పని చల్లగా సాగిపోతుంది.
తెలుగు దేశం పార్టీ ఎమ్మల్యేలను కూడా అలాగే అర్ధరాత్రి దీక్షా భంగం చేసి హాస్పిటల్ కి తరలించారు. భాజపా విషయంలో మరీ రాత్రి వరకు ఆగలేదు కానీ, వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షను మళ్ళీ అర్ధరాత్రి భంగం చేసారు. ఐదు రోజులవటంతో ఇలాంటిదేదో చేస్తారని ఊహించిన కార్యకర్తలు సిద్ధంగానే ఉన్నారు. అందువలన పోలీసులకు, కార్యకర్తలకు మధ్య కాసేపు తోపులాట జరిగింది కానీ పోలీసులు చెయ్యి ఎలాగూ పైనే ఉంటుంది కాబట్టి, వారి సామర్థ్యాన్ని కొలమానం కూడా అదే కాబట్టి, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని విజయమ్మ, దీక్షలో పాల్గొన్న ఇతర నాయకులను హాస్పిటల్ కి తరలించారు.
దీక్ష ఐదు రోజులు దాటుతుండటం, దీక్షలో పాల్గన్నవారి ఆరోగ్యాలు క్షీణిస్తుండటంతో సభాపతి నాదెండ్ల మనోహర్ వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా వారి దీక్షలను భంగం చేసి వారిని హాస్పిటల్ కి తరలించమని ఆదేశాలివ్వటంతో పోలీసులు ఆ పనిని నెరవేర్చారు.
ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేసారు. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను ముందు అరెస్ట్ చేస్తేనే కానీ నేతలను తరలించలేకపోయారు. ఈ పరిస్థితిని ముందే ఊహించిన పోలీసులు భారీ బలగాలతో దీక్షాస్థలికి వెళ్ళారు. ముగ్గురు డిసిపిలు, ముగ్గురు ఎసిపిలు ఇందుకు సారధ్యం వహించారు. ఆంబులెన్స్ లో నేతలను నిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.
నిమ్స్ కి చేరుకున్న తర్వాత ఈ రోజు ఉదయం విజయమ్మ దీక్షను విరమించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more