బీదరిపు రేఖకంటే అడుగున వున్న నిరుపేదలకోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని వెసులుబాట్లను చేసారు. ఉప్పు పప్పు చింతపండు నూనె కారం పసుపు లాంటి నిత్యావసర వస్తువులను ప్రతినెలా 185 రూపాయలకే సరఫరా చేయిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అన్నారు. ఎస్ సి ఎస్ టి సబ్ ప్లాన్ కింద మార్కెట్ లో 292 రూపాయలకు లభించే నిత్యావసర వస్తువులను రాయితీ తగ్గించి 185 కే లభించేట్టుగా చూస్తానని ఆయన మాటిచ్చారు.
రోజు రోజుకీ పెరిగిపోతున్న ధరల నుంచి పేదవర్గాలను ఆదుకోవటానికి ఇది ఒక మంచి ఉపాయమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ నెల 11 ఉగాది రోజు నుంచి ఈ పథకం అమలులోకి వస్తుంది. అదే రోజు జ్యోతిరావు ఫులే జన్మదినం అవటం విశేషమని కూడా ముఖ్యమంత్రి అన్నారు. ఎస్ సి ఎసి టి సబ్ ప్లాన్ అమలు ద్వారా ఇందిరా గాంధీ కలలు సాకారమవుతున్నాయని కూడా ఆయన అన్నారు.
సాధికారమైన ఈ పథకం అమలు వలన గతంలో జరిగినట్టుగా ఈ నిధులలో అవినీతి జరగటం ఉండదని కిరణ్ కుమార్ అన్నారు. పది లక్షల మంది ఎస్ సి కుటుంబాలకు విద్యుత్ ని ఉచితంగా సరఫరా చేస్తామని కూడా ఆయన మాటిచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ముఖ్యమంత్రి దళిత కుటుంబంతో కలిసి భోజనం చేసారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more