విద్యుత్ ఛార్జీల పెంపు మీద ఆందోళన చేస్తున్న తెలుగు దేశం పార్టీ నాయకులు ఈ రోజు ఈఆర్ సి ఛైర్మన్ రఘోత్తమ రావు కి విద్యుత్ ఛార్జీలను పెంచరాదంటూ వినతిపత్రాన్ని ఇచ్చారు. దానిమీద ఆయన స్పందన కోసం తెదేపా నాయకులు పట్టుబట్టగా, ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకూ తనేమీ చెప్పలేనని అన్నారు. ఈ విషయం మీద బహిరంగ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి వాటిలో వచ్చిన అభ్యంతరాలను సూచనలను పరిగణలోకి తీసుకుంటామని ఆయన అన్నారు. ఆ మాటలకు తృప్తిపడని తేదేపా నాయకులు ఛార్చీలను పెంచటం లేదనే హామీని స్పష్టంగా ఇవ్వమని కోరుతూ ఈఆర్ సి ఛైర్మన్ కాబిన్ లో ఆందోళనకు దిగి బైఠాయించారు.
నిన్న అర్ధరాత్రి తెదేపా నాయకుల దీక్షకు భంగం కలిగిస్తూ వారిని హాస్పిటల్స్ కి తరలంచి బలవంతంగా వైద్యం చేయించటం మీద నిరసన తెలియజేస్తూ తెలుగు దేశం పార్టీ నాయకుడు తలసాని యాదవ్ నిర్వహించిన మౌన దీక్షలో నల్లగుడ్డ నోటికి కట్టుకుని తెదేపా నాయకులు ఇందిరా పార్క్ దగ్గర కూర్చున్నారు.
కేంద్ర ఇంధన శాఖాధికారి ఏ.ఎస్.భక్షి విద్యుత్ సమస్యను ఎలాగైనా అధిగమిస్తామని హామీ ఇస్తున్నారు. విద్యుత్ సౌధలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో విద్యుత్ కొరత అధికంగా ఉందని, గ్యాస్ సకాలంలో లభించకపోవటం, వర్షాలు సరిగ్గా కురవకపోవటం లాంటి కారణాల వలన విద్యుదుత్పత్తి తగ్గిపోవటం వలనే ఈ సమస్య ఏర్పడిందని, అయితే ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారాన్ని కనుగొంటామని భక్షి చెప్పారు.
రాష్ట్రంలోని విద్యుత్ సమస్య మూడు నెలల్లో అంతరించిపోతుందని, అందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని మంత్రి బస్వరాజు సారయ్య ఈ రోజు వరంగల్ లో అన్నారు. ప్రత్యామ్నాయంగా సౌరశక్తి వినియోగంతో వ్యవసాయం చేసుకునే రైతులకు రాయితీలు కూడా ఉంటాయని ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more