కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలపై ఈరోజు జమ్మూ కాశ్మీర్ శాసనసభ రెండు గంటల్లో మూడు సార్లు వాయిదాపడింది. ఉరితీసిన ఉగ్రవాది అఫ్జల్ గురు భౌతిక కాయాన్ని అతని కుటుంబీకులకు అప్పజెప్పటానికి నిరాకరించిన షిండే మాటల వలన సభలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీ, ఇండిపెండెంట్ శాసన సభ్యుడు ఇంజనీర్ రషీద్, పీపుల్స్ డెమాక్రటిక్ ఫ్రంట్ నుంచి హకీమ్ మొహమ్మద్ యాసిన్, సిపిఎమ్ శాసన సభ్యుడు మొహమ్మద్ యూసఫ్ తరిగామి షిండే వ్యాఖ్యలకు అభ్యంతరాలు తెలియజేస్తూ, బడ్జెట్ సెషన్ ని అడ్డుకున్నారు. షిండే మాటలు పార్లమెంటు, జమ్మూ కాశ్మీర్ శాసన సభలను అగౌరవపరచేలా ఉన్నాయంటూ ఆందోళన చేసారు.
దానితో కాంగ్రెస్ శాసన సభ్యులు ఒంటరివాళ్లైపోయారు. వారిలో కూడా కొందరు అఫ్జల్ గురు శరీరాన్ని అతని కుటుంబీకులకు అప్పజెప్పాలని అనటంతో ముస్లిం సభ్యులంతా ఏకమై అందుకు అనుగుణంగా శాసన సభలో నిర్ణయాన్ని తీసుకోవాలంటూ పట్టుబట్టారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మిగిలిన హిందూ శాసన సభ్యులంతా దానికి వ్యతిరేకంగా ఆందోళన చేసారు. పార్లమెంటు మీద దాడి చేసిన ఉగ్రవాదిని సుప్రీం కోర్టు శిక్ష విధించిన తర్వాత ఆ విషయం మీద చర్చించటానికి ఈ శాసన సభలో అవసరమేముందంటూ భాజపా, నేషనల్ పాంథర్స్ పార్టీ, జమ్మూ స్టేట్ మోర్చా అభ్యంతరం తెలియజేసాయి. జాతీయతకు వ్యతిరేకంగా మాట్లాడటం, సభా సమయాన్ని వృధా చెయ్యటం చేస్తున్నారంటూ ప్రతివాదనకు దిగారు.
ఈ గందరగోళానికి తెరదించటానికి లా మినిస్టర్ సైయిఫుల్లా లేచి నిలబడి, ఈ సున్నితమైన విషయంలో అందరి మనోభావాలనూ సభ గౌరవిస్తుందంటూ ప్రకటించారు. కాకపోతే, ఆయన మాటల్లో అఫ్జల్ గురు సాహెబ్ అని అనటం తో మరోసారి చిచ్చురేగింది. దేశ గౌరవాన్ని మంటగలుపుతూ ఒక ఉగ్రవాదికి, ఉరిశిక్ష విధించి అమలుపరచిన దోషికి అంత గౌరవమిచ్చి మాట్లాడుతారా అంటూ ఆందోళనచేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more