రాష్ట్రంలో రాజకీయ నాయకుల కేసుల పరంపరలు నడుస్తున్నాయి. రెండు ప్రాంతాల నాయకులు ఒకరి మీద ఒకరు కేసులో పెట్టుకొనే స్థాయికి ఎదిగిపోయారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖరరావు, తెలంగాణ జెఏసి కన్వీనర్ కోదండరామ్పై కాంగ్రెస్ భగ్గుమంది. ఇందిరాపార్కు వద్ద జరిగిన సమర దీక్ష ముగింపులో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుంది. దీంతో కాంగ్రెస్ నేతల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నెహ్రూ కుటుంబంపై నోటికి వచ్చినట్టు మాట్లాడటం, ఇందిరాగాంధీ, ప్రధాని మన్మోహన్, సోనియాగాంధీపైనా తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కెసిఆర్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్లోని గాంధీనగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కెసిఆర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించి న్యాయ నిపుణుల సలహా కోసం పంపించినట్టు ఇన్స్పెక్టర్ మోహన్కుమార్ తెలిపారు.
ఇందిరాపార్కు వద్ద జరిగిన సమావేశంలో వీరు చేసిన వ్యాఖ్యల రికార్డింగ్ను సైఫాబాద్ ఎసిపి, సెంట్రల్ జోన్ డిసిపిల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. న్యాయ నిపుణుల నివేదిక వచ్చిన తర్వాత కెసిఆర్పై కేసు నమోదు చేసేది లేనిదీ చెబుతామని తెలిపారు. అలాగే విజయవాడలో మాచవరం పోలీసు స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ కూడా కెసిఆర్, కోదండరామ్పై ఫిర్యాదు చేశారు. దేశ ప్రధానిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఇరువురిపైనా 124ఎ, 120బి, 153ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు అరండల్పేటలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కన్వీనర్ ఎండి హిదాయత్, సమైక్యాంధ్ర విద్యార్థి విభాగం కన్వీనర్ షేక్ జిలాని తదితరులు అరండల్పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కెసిఆర్, కోదండరామ్లపై 124, 124ఎ, 153బి, 504, 503, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more