లంచం తీసుకున్నట్లు తనపై వచ్చిన ఆరోపణల పట్ల మంత్రి రాంరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలనీ, నాపై కుట్ర పన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి రాంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తాను ఎవరినీ డబ్బు డిమాండ్ చేయలేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేసే వారిపై పరువు నష్టం దావా కేసు వేస్తానని మంత్రి రాంరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. ఇందులో రాజకీయ కుట్ర ఉన్నట్లు, పాపారావు అనే వ్యక్తి హస్తం ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ఖమ్మం చైతన్య టెక్నో పాఠశాలకు చెందిన పాపారావు అనే వ్యక్తి తనకు రూ. 35 లక్షలు లంచం ఇచ్చారన్నది అబద్ధం అని స్పష్టం చేశారు. అతనెవరో కూడా తనకు తెలియదన్నారు. ఇదంతా రాజకీయ కుట్ర అని ఆరోపించారు. 450 ఎకరాలను తాను కబ్జా చేశానని చెబుతున్నరు, కానీ ఖమ్మం జిల్లా నెమలిపూడిలో 750 ఎకరాలను గిరిజనులకు పంచిన చరిత్ర తమది అని పేర్కొన్నారు. తనపై వచ్చిన అభియోగాలకు బహిరంగ విచారణకు సిద్ధమని తేల్చిచెప్పారు. వ్యక్తిగత కారణాల వల్లే టీ కాంగ్రెస్ ఐక్యత సదస్సుకు హాజరు కాలేకపోయానని తెలిపారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమని చెప్పారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more