గవర్నర్ ఈ ఫైలును తిప్పిపంపడం సర్కారుకు పిడుగుపాటులా ఉంది. దానిపై కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసిన రోజునే మీడియాలో కథనాలు వచ్చాయిగానీ, నిజానికి అంతకు ముందే ఫైలు చేరింది. గవర్నర్ నిర్ణయంపై ఏం చేయాలన్న విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. బొత్స సత్యనారాయణ, సబితాఇంద్రారెడ్డి, శ్రీధర్బాబు, విశ్వరూప్తో పాటు కేంద్ర మంత్రి బలరాంనాయక్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దాదాపు 45 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో ధర్మాన ప్రాసిక్యూషన్ విషయంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఫైలును తిప్పిపంపుతూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం పట్ల ఒకరిద్దరు మంత్రులు విస్మయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గవర్నర్ లేవనెత్తిన సందేహాల కారణంగా కేబినెట్ ముందుకు మరోసారి ఫైలును తీసుకురావద్దని మంత్రులు సిఎంను కోరినట్లు సమాచారం. సిఎంతో భేటీ అనంతరం ఒక మంత్రి ఈ విషయాన్ని ధృవీకరించారు. 'ఈ సమస్యను ప్రతిష్టగా తీసుకోవాలనుకోవడంలేదు. అన్ని విషయాలను పరిశీలించడం మేలు' అని ఆయన అన్నారు. ఈ మల్లగుల్లాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం వేచిచూడాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇదే విషయమై సిబిఐ కోర్టులో విచారణ జరుగుతున్నందున కోర్టు నిర్ణయం వెలువడేంతవరకూ వేచిచూసే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. మొదటి నుండి ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి వైఖరిని తప్పుపడుతున్న మంత్రి డిఎల్ రవీంధ్రారెడ్డి 'గవర్నర్ ఫైలును తిప్పిపంపడం ప్రభుత్వానికి ఇబ్బందే' అని స్పందించారు. అసలు తానుగా తీసుకోవాల్సిన ప్రాసిక్యూషన్ మినహాయింపు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేబినెట్ మొత్తానికి ఆపాదించే ప్రయత్నం చేయడం సరికాదని గతంలో వ్యాఖ్యలు వచ్చాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more