తమిళులపై దాడికి పాల్పడుతున్న లంకేయులను శిక్షించాల్సిందేనని గళమెత్తుతున్న రాష్ట్ర వాసులు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. తంజావూరు సమీపంలోని క్రైస్తవ ఆలయ దర్శనానికి వచ్చిన లంకేయులను తరిమికొట్టినంత పని చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.తంజావూరు సమీపంలోని పూండీలో ప్రసిద్ధి గాంచిన క్రైస్తవ మాతా ఆలయం వుంది. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు 184 మంది శ్రీలంక దేశస్థులు పూండీకి చేరుకున్నారు. శ్రీలంక నుంచి తిరుచ్చికి విమాన మార్గం ద్వారా వచ్చిన వీరంతా అక్కడ నుంచి వ్యాన్లో పూండీకి చేరుకున్నారు. ఆలయానికి సమీపంలో ఉన్న విడిది గృహాలలో బస చేశారు. వీరంతా ఆలయ ఉత్సవాల్లో పాల్గొనేందుకు నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితుల్లో శ్రీలంకకు చెందిన వారు పెద్ద సంఖ్యలో పూండీకి చేరుకున్నట్టు స్థానికంగా వున్న పలు తమిళ సంఘాలకు సమాచారం అందడంతో పెద్ద సంఖ్యలో తమిళ సంఘాల ప్రతినిధులు విడిది గృహాల వద్దకు చేరుకున్నారు. విడిది గృహాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. 'శ్రీలంకేయులను వెంటనే బయటికి పంపించండి లేకపోతే పరిస్థితులు దారుణంగా వుంటాయి' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదముందని గ్రహించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపచేసేందుకు యత్నించారు. నామ్ తమిళర్ ఇయక్కం ప్రతినిధి న్యాయవాది నల్లదురై, వీసీకే నేత వివేకానందన్, తమిళ్ దేశ పొదువుడమైప్పు పార్టీ నేత పాల్రాజ్ల నేతృత్వంలో భారీగా తరలివచ్చిన ఆందోళనకారులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. శ్రీలంకేయులను వెంటనే అక్కడి నుంచి వెనక్కి పంపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఎంత నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో పోలీసులు కొంత మెత్తబడ్డారు. లంకేయులను వెనక్కి పంపించేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more