మలక్పేట యశోదా ఆస్పత్రి లో పనిచేస్తున్న ఓ వైద్యుడు కిడ్నాప్ అయ్యాడు. మొదట్లో కనిపించడంలేద ని చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు అందింది. కాగా ఆ డాక్టర్ మొబైల్ నుంచి అ తని తండ్రికి ఫోన్ చేసి రూ.40లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులకు సమాచారమివ్వడంతో ఈ కేసు ను కిడ్నాప్ కేసుగా భావిస్తూ ఆకోణం లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించా రు. చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ జావేద్ కథనం ప్రకారం.. మలక్పేట నివాసి డాక్టర్ హర్షారెడ్డి (31) మలక్పేట యశోదా ఆస్పత్రిలో రేడియాలజిస్ట్గా ప నిచేస్తున్నారు. రోజూ మాదిరిగానే హ ర్షారెడ్డి సోమవారం సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో ఆస్పత్రి నుంచి వెళ్లి ఆస్పత్రికి రాకపోవడంతో అతని స్నేహితుడు హేమంత్ చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు డాక్టర్ హర్షారెడ్డి తప్పిపోయినట్లుగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. హర్షారెడ్డి తల్లిదండ్రులు విజయవాడలో ఉంటున్నారు. కాగా హ ర్షారెడ్డి మొబైల్ నుంచి అతని తండ్రి లక్ష్మారెడ్డి ఇంటి ల్యాండ్లైన్కు ఫోన్ చేసి రూ. 40లక్షలు ఇవ్వాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు డిమాండ్ చేశారు. దీంతో లక్ష్మారెడ్డి ముందుగా తన కుమారుడు ఎక్కడ ఉన్నాడంటూ అతని స్నేహితుడైన హేమంత్ను వాకబు చేయగా కనిపించడంలేదంటూ చెప్పి చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని వివరించారు. దీం తో తనకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్చేసి రూ.40 లక్షలు డిమాండ్ చేసిన విషయాన్ని లక్ష్మారెడ్డి విజయవాడ నుంచి హైదరాబాద్కు చేరుకొని చాదర్ఘాట్ పోలీసులకు వివరించారు. దాంతో పోలీసులు డాక్టర్ హర్షారెడ్డి మిస్సింగ్ కేసును కిడ్నాప్గా పరిగణిస్తూ కేసును ఆకోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు చాదర్ఘాట్ ఎస్సై పరుశరాంతో కూడిన ఓటీమ్, సుల్తాన్బజార్ ఏసీపీ టీమ్, తూర్పు మండలం టాస్క్ఫోర్స్ పోలీసులతో మరో టీమ్ను రంగంలోకి దింపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more