రాష్టప్రతి ఎన్నికల హడావుడిలో ఉండటంతో అది ఒక కొలిక్కి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యవహారాలపై అధిష్ఠానం దృష్టి పెట్టనుంది. ఉపఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రానికి చెందిన కొందరు ప్రముఖులు అధిష్ఠానం పెద్దల్ని కలిసినపుడు వారికి ఇదే విషయాన్ని చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ‘ప్రస్తుతం రాష్టప్రతి ఎన్నిక వ్యవహారం తప్ప ఇంకే విషయాలు పట్టించుకునే పరిస్థితి లేదు, రాష్టప్రతి ఎన్నిక ఘట్టం ముగిసిన తర్వాతగాని, ఒకవేళ రాష్టప్రతి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లయితే వెంటనే రాష్ట్ర వ్యవహారాలపైనే దృష్టి పెట్టనున్నాం’ అని అధిష్ఠానం ప్రముఖులు చెప్పినట్లు తెలిసింది. రాష్టప్రతి ఎన్నిక వ్యవహారం తర్వాత అధిష్ఠానం అజెండాలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలే ప్రథమ స్థానంలో ఉందని వారు చెప్పినట్లు తెలిసింది. అధిష్ఠానం తలపెట్టిన మార్పుల్లో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ను తప్పించనున్నట్లు తెలిసింది. ఆజాద్ స్థానంలో కేంద్రమంత్రి వాయలార్ రవిని లేదా మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్సింగ్ను గాని నియమించనున్నట్లు తెలిసింది. వాయలార్ రవిని నియమించాలనుకున్న పక్షంలో ముందుగా ఆయన్ను ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా గాని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యునిగా గాని నియమించాల్సి ఉంటుంది. వాయలార్కు ప్రస్తుతం ఎఐసిసిలో ఎటువంటి పదవి లేదు. దిగ్విజయ్ సింగ్ ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జోడీ తాము ఆశించిన, అనుకున్న స్థాయిలో సంతృప్తికరంగా లేదని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ల జోడీ నాయకత్వంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. వీరిద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నప్పటికీ వారిలో ఎవరూ బహిరంగంగా బయటపడలేదని, ఏదైనా ఉంటే అధిష్ఠానవర్గం దృష్టికి మాత్రమే తీసుకువచ్చే వారని ఎఐసిసి నాయకులు అభిప్రాయపడుతున్నారు. చాలామంది మంత్రుల పని తీరు కూడా సంతృప్తికరంగా లేదని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో ఇప్పుడున్న ‘టీం’తో 2014లో సాధారణ ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమేనన్న అభిప్రాయంతో అధిష్ఠానం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న ఆశ లేదని, కనీసం మెరుగైన ఫలితాలు సాధించేలా అయినా చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం అనుకుంటున్నట్లు తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more