ఈ దఫా ప్రెసిడెంట్ ఎవరనే దానిపై వినూత్న పరిణామాలు ఎదురవుతున్నాయి. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయకూడదని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కలామ్ చేశారు. ఎన్డీఏ కూటమి తరపున పోటీచేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ కోరగా అందుకు కలామ్ సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. అయితే రాష్ట్రపతి ఎంపిక రేసు నుంచి కలామ్ తప్పుకోవడం మమతా బెనర్జీకి దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. కలామ్ తాజా నిర్ణయంతో మమతా ఎలాంటి ఎత్తు వేస్తోందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కలామ్, సోమనాథ్ చటర్జీ, మన్మోహన్ సింగ్ పేర్లను మమతా బెనర్జీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. యూపీఏ ప్రతిపాదించిన ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వంపై మమతా అనాసక్తిని ప్రదర్శిస్తోంది.
ఈ పరిస్థితుల్లో 13వ రాష్ట్రపతి ఎవరన్న అంశంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. మిత్ర పక్షాలు, భాగస్వామ్య పక్షాలతో ఎన్డీఏ సంప్రదింపులు కొనసాగుతూనే వున్నాయి. కలాం పోటీకి దిగననడం, సంగ్మా వెనక్కి తగ్గేది లేదనడంతో ఎన్డీఏ అయోమయంలో పడిపోయింది. ఏదేమైనా 2014 ఎన్నికల లక్ష్యంగా తన కూటమిని బలోపేతం చేసుకునేందుకు ఎన్డీఏ ఈ ఎన్నికను వాడుకుంటోంది.
మరోవైపు అన్నాడిఎంకె, బిజెడి ఇప్పటికే సంగ్మాకు మద్దతు ప్రకటించారు. ప్రణబ్ కున్న అనుభవం, అర్హతల రీత్యా పోటీ పెట్టరాదని జెడియూ నేత శివానంద తివారీ పట్టుబడుతున్నారు. ప్రణబ్ గెలుపు అవకాశాలు స్పష్టంగా వున్నాయని, పార్లమెంటులోనూ, ప్రభుత్వంలోనూ అత్యంత అనుభవ శీలి అయిన ప్రణబ్ అభ్యర్ధిత్వానికి తిరుగులేదని ఆయనంటున్నారు. ఆయన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి అత్యంత సన్నిహితుడు. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రణబ్ ముఖర్జీని పోటీ లేకుండా ఎన్నుకోవడం మంచిది కాదని అడ్వానీ, సుష్మా స్వరాజ్ వాదించారు. సంగ్మాను పోటీకి దింపితే అన్నాడిఎంకె, బిజెడి లాంటి మిత్రపక్షాల తో స్నేహం మళ్లీ పెరుగుతుందని అది వచ్చే ఎన్నికల నాటికి ఉపయోగపడుతుందని బిజెపి ముందు చూపుతో వుంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more