ఉపఎన్నికల ఫలితాల తరువాత అసెంబ్లీలో రాజకీయ పార్టీల బలాబలాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైసీపీ, టీఆర్ఎస్ లు బలం పుంజుకోగా, కాంగ్రెస్, టీడీపీలు నష్టపోయాయి. అయితే గుడ్డిలో మెల్లగా కాంగ్రెస్ రెండు స్థానాలను కైవసం చేసుకొని ఊరట చెందగా తెలుగుదేశానికి అది కూడా దక్కలేదు. కానీ తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లలో ఓడిపోయినా ఆ పార్టీ బలంలో మాత్రం మార్పు లేదు. తాజాగా ఉపఎన్నికల ఫలితాల తరువాత అసెంబ్లీలో పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీకి 155మంది ఎమ్మెల్యేల బలం ఉండగా ఏడుగురు ఎంఐఎం శాసనసభ్యుల మద్దతు తీసుకుంటే ఆ పార్టీ సంఖ్యా బలం 162. ఇందులో నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు తాజాగా రాజీనామా చేశారు. అంటే ప్రస్తుతం కాంగ్రెస్ బలం 160మంది ఎమ్మెల్యేలు. ఇక తెలుగుదేశానికి 86మంది శాసనసభ్యులు ఉండగా టీఆర్ఎస్, వైసీపీ బలం పుంజుకున్నాయి. ఈ ఉపఎన్నికలకు ముందు ఇద్దరే ఉన్న వైసీపీ సభ్యుల బలం 15నుంచి 17కు పెరిగింది. టీఆర్ఎస్ బలం అంతకుముందు 16ఉండగా పరకాల స్థానంతో 17కు చేరింది.
ఇక సీపీఐకి నలుగురు ఎమ్మెల్యేలు ఒక్క సీపీఎం ఎమ్మెల్యే, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు, లోక్ సత్తాకు ఒక ఎమ్మెల్యే ఉండగా స్వతంత్ర సభ్యులు ముగ్గురు అసెంబ్లీలో ఉన్నారు. అయితే వీరిలో కూన శ్రీశైలంగౌడ్ కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ అనుబంధ ఎమ్మెల్యేగా ఉండగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి మాత్రం ఏ పార్టీతో కలవక తటస్థుడిగా ఉన్నారు.
కాగా, ఉప ఎన్నికల్లో ఓటమిపై సొంతపార్టీ నుంచే విమర్శలు తీవ్రమవుతుండటంతో ఎట్టకేలకు కాంగ్రెస్ సమన్వయ కమిటీని సమావేశపరిచేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు గాంధీభవన్ లో సమన్వయ కమిటీ భేటీ కానుంది. కాగా ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గులాం నబీ హాజరు కావటం లేదు. ఉప ఎన్నికల ఓటమికి దారితీసిన పరిస్థితులపై ఈభేటీలో సమీక్ష జరపనున్నారు
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more