టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి నేటితో 11 సంవత్సరాలు అయిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ తో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించారు. మొదట ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి, తెలంగాణ త్యాగధనులకు నివాళలు అర్పించారు.అనంతం కేసీఆర్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నుండి టీఆర్ఎప్ పార్టీ తెలంగాణ కోసం పారాడుతుందని, ఇక పై కూడా తెలంగాణే లక్ష్యంగా శాంతియుతంగా పోరాడతామని అన్నారు.
తెలంగాణ కోసం పార్టీని పెట్టినప్పుడు పదవులు ఇవ్వకుంటేనే పార్టీని పెట్టాడని అది ఎంతో కాలం నిలవదని పలువురు సందేహాలు వ్యక్తం చేశారని, కానీ తన పార్టీ సత్తా ఏమిటో ఇప్పటికీ చూపుతూనే ఉన్నామని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఇస్తానని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఇప్పటికీ మోసం చేస్తూనే ఉందని అన్నారు. తెలంగాణ తీర్మానం పెట్టాలని పార్లమెంటులో డిమాండ్ చేసిన తమ ఎంపీలనే మార్షల్స్ చే గెంటివేయించిందని, ఒక వేళ వాళ్ళకు తెలంగాణ కావాలని ఉంటే అధిష్టానం కాళ్ళు పట్టుకొని వేళ్ళాడకుండా తమతో వచ్చి పోరాడాలని సూచించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ మిత్రద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు. తన దెబ్బతో కూలబడిన పార్టీ ఇంకా కోలుకోవడం లేదని ఆయన అన్నారు.
సమైక్య పాలనలో తెలంగాణ జీవనం విధ్యంసం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.పాశవిక అణచివేతల వల్లే తెలంగాణ ఉద్యమాలు ముందుకు సాగలేదన్నారు. త్యాగాల పునాదుల మీద టీఆర్ఎస్ ఏర్పడిందని చెప్పారు. కలుషిత జలాలతో పొంగిపొరలే మూసినదికి తెలంగాణ వస్తేనే పూర్వవైభవం వస్తుందన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత వికారాబాద్ జిల్లా ఏర్పాటు చేస్తామని ఆయన హమీ ఇచ్చారు.
గత కొన్ని రోజుల నుండి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో కలుస్తుందనే వార్తలు వస్తున్నాయని, తాము కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో చేరబోమని ఇది తాను అధికారికంగా చెబుతున్నాని అన్నారు. పార్టీని పునర్నిర్మించి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతానని ఆయన హామి ఇచ్చారు.
ఇదిలా ఉండగా, మాజీ డిజిపి పేర్వారం శ్రీరాములు కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. రంగారెడ్డి జిల్లా టిడిపి నేత లక్ష్మణరావు కూడా టిఆర్ఎస్ లో చేరారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more