మారుతున్న కాలంతో పాటు సగటు మనిషి జీవిత ప్రమాణాలు మారుతున్నాయి. వాటి ఫలితంగా రానున్న కాలంలో మగవారు లేకుండా పోతారని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. రానున్న 50 సంవత్సరాల్లో బావి తరాల పిల్లలకు సంతానం కనే శక్తి ఉండదని చెబతుతున్నారు. గడచిన 50ఏళ్లలో సగటు వీర్యకణాల సంఖ్య యాభై శాతం తగ్గిపోవడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తల అంచనా. పెరుగుతున్న ఒత్తిడి, స్థూలకాయం, వాయు కాలుష్యం వంటి కారణాలతో ఈ ముప్పు వాటిల్లుతోందంటున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా పాశ్చాత్యుల్లో వీర్యకణాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని, అదే సమయంలో భారత్లో కూడా తగ్గుదల నమోదవుతున్నట్లు గుర్తించామని ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త పి.ఎం. భార్గవ వెల్లడించారు.కొన్నేళ్ల కిందట స్కాట్లండ్లో జరిగిన ఓ పరిశోధన ఫలితాలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. 1989 నుంచి 2002 మధ్య కాలంలో 7500 మందిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు- కాలక్రమంలో వారి వీర్యకణాల సంఖ్య 30% తగ్గినట్లు నిర్ధారించారని తెలిపారు.
కాలుష్యంతోపాటు ప్లాస్టిక్లో నిల్వ ఉంచే ఆహారపదార్థాల వినియోగం కూడా వీర్యకణాలపై ప్రభావం చూపుతోందని కొందరు పరిశోధకులు కనుగొన్నారు. ప్లాస్టిక్ నుంచి స్త్రీలలో విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ను పోలిన రసాయనం ఉత్పన్నమవుతోందని, ఇది వీర్యకణాల సంఖ్యను ప్రభావితం చేస్తోందని తేల్చారు. ఈ సిద్ధాంతంపై కొంత వ్యతిరేకత కూడా వస్తోంది. ఇంతవరకూ ఇది అధికారికంగా నిరూపితం కాలేదన్నది వారి వాదన. మరోవైపు డబ్ల్యూహెచ్వో కూడా వీర్యకణాల సంఖ్య విషయంలో యాభై ఏళ్ల క్రితం స్పెర్మ్ బ్యాంకు(వీర్య నిధి)లకు విధించిన నియమాలను ఎప్పటికప్పుడు సవరించుకోవాల్సి వస్తోందని నిపుణులు గుర్తుచేస్తున్నారు. 1950లో మిల్లీ లీటర్కు 11.30కోట్ల వీర్య కణాలను సాధారణ సంఖ్యగా పేర్కొన్న డబ్ల్యూహెచ్వో ఇప్పుడు 2కోట్ల వీర్యకణాలుంటే చాలంటోంది!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more