కాంగ్రెస్, టీడీపీల్లో రాజ్యసభ కసరత్తు చివరి అంకానికి చేరింది. కాంగ్రెస్ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఇద్దరు పెద్దల సభకు వెళ్ళే ఛాన్సుండటంతో అభ్యర్ధుల పేర్లను పరిశీలిస్తున్నాయ్. హస్తం పార్టీ నుంచి ఇప్పటికే చిరంజీవి, రషీద్ అల్వీ పేర్లు ఫైనల్ అయ్యాయి. టీడీపీలో ఆశావాహుల తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది.
రాజ్యసభ ఎన్నికల్లో మన రాష్ట్రం నుంచి ఉన్న ఆరు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.
తమకున్న నాలుగు స్థానాలకు క్యాండేట్లను ఎంపిక చేయడం కాంగ్రెస్కు కత్తిమీద సాములానే మారింది. పీఆర్పీని విలీనం చేసినందుకు ప్రతిఫలంగా చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. అటు ఇతర రాష్ట్రాల అభ్యర్థుల కోటాలో రషీద్ అల్వీ, షకీల్ అహ్మద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే వీరిద్దరిలో రషీద్ అల్వీ పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలిన రెండు స్థానాలకు పోటీ తీవ్రంగా ఉంది.
ఈ సారి రాష్ట్ర పరిణామాలనే కాకుండా జాతీయ సమీకరణాలను కూడా దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్న అధిష్టానం.. ఆచితూచి అడుగులు వేస్తోంది. దీనికోసం ఢిల్లీలోనే ఉన్న సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సతో హైకమాండ్ విస్తృత మంతనాలు జరిపింది. తెలంగాణ సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకుని చూస్తే కేకే కు మరో అవకాశం దక్కుతుందని భావిస్తుండగా.. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కోసం సీఎం కిరణ్ గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
ఇక అధినేత్రి సోనియాతో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా రేణుకా చౌదరికి కూడా అవకాశం ఉందని సమాచారం. అటు.. INTUC నేత సంజీవరెడ్డి, పారిశ్రామికవేత్త వెంకట్రామిరెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు TDPలో రాజ్యసభ సీట్ల వ్యవహారం కూడా కొలిక్కి వస్తోంది. సీమాంధ్ర నుంచి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు సీఎం రమేష్ పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.
అటు తెలంగాణ నుంచి మాజీ మంత్రి దేవేందర్గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, బక్క నర్సింహులు, అరవింద్కుమార్ గౌడ్ పదవి ఆశిస్తున్నారు. వీరిలో... పార్టీలో నెంబర్ టూగా ఉన్న దేవేందర్గౌడ్ కే ఈ ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే తమ పార్టీ రాజ్యసభ అభ్యర్థిత్వాలకు ఇంకా ఎవరి పేర్లు ఖరారు కాలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more