దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఓబుళాపురం గనుల లావాదేవీల్లో సరికొత్త విషయాలు వెలుగుచూడసాగాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గాలి జనార్దన్రెడ్డి అక్రమాలకు సంబంధించి కర్నాటకు చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు సిబిఐ అధికారుల ను దిల్కుషా గెస్ట్హౌస్లో కలిశారు. రెండు గంటలకు పైగా ఇడి అధికారులు సిబిఐ అధికారులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో గాలికి సంబంధించి విదేశీ సంస్థల సహాయం, ఇదే సమయంలో విదేశాల్లో అతను దాచిన డబ్బుల వివరాలను ఇడి అధికారులు సిబిఐకి తెలిపారని తెలుస్తోంది. గాలి ప్రస్తుతం కర్నాటక సిబిఐ కస్టడీలో ఎఎంసి కేసుకు సంబంధించిన విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
గాలితో పాటు అతని పిఎ అలీఖాన్ కూడా సిబిఐ కస్టడీ లోనే వున్నారు. వీరిద్దరినీ నాలుగు రోజులుగా విచారిస్తున్న అక్కడి సిబిఐ అధికారులు కొంత కీలక సమాచారం రాబట్టారని తెలిసింది. ఈ సమాచారాన్ని క్రోఢకీరించుకునేందుకు కర్నాటక నుంచి ఇడి అధికారులు రాష్ట్ర సిబిఐ అధికారులను కలిశారు. గాలి అక్రమ వ్యాపారంలో పలు విదేశీ సంస్థల పాత్ర ఇప్పటికే నిగ్గు తేలగా, పలు విదేశీ బ్యాంకుల్లో గాలికి సంబంధించిన వందల కోట్ల రూపాయల నిధులు మూల్గుతున్నట్లు కూడా కూడా తేలింది.
ఈ నిధులు కర్నాటకలోని ఎఎంసి గనుల అక్రమ తవ్వకాల ద్వారా గాలి సమకూ ర్చుకుని విదేశాల్లో దాచారని అక్కడి ఇడి అధికా రులు నిర్ధారణకు వచ్చారని తెలిసింది. ఇదే విష యాన్ని వారు రాష్ట్ర సిబిఐ అధికారులకు చెప్పారని సమాచారం. ఈ అంశాలకు సంబంధించి కర్నా టక ఇడి అధికారులు ఇదివరకే కేసులు నమోదు చేశారు. మరో నాలుగు రోజుల్లో గాలి కస్టడీ పూర్త వనుండడంతో అతన్ని తిరిగి చంచల్గూడ జైలుకు తరలించనున్నారు. కాగా కర్నాటక ఇడి అధికారు లందించిన సమాచారం ఆధారంగా గాలిపై మరికొన్ని కేసులు నమోదు చేసేందుకు ఇక్కడి సిబిఐ అధికారులు సన్నాహాలు చేయసాగారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more