ఉత్తరప్రదేశ్ లో మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలలో బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలను ఖంగుతినిపించి మ్యాజిక్ ఫిగర్ 224 సీట్లను గెలుచుకొని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది సమాజ్ వాజ్ పార్టీ. ఎన్నికల తరువాత ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగా ? లేక పార్టీని విజయపథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించిన ములాయం సింగ్ తనయుడు అఖిలేష్ యాదవా ? అనే ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి యూపీ ముఖ్యమంత్రి పీఠం పై కూర్చునేది తండ్రా ? తనయుడా ? అనే సస్పెన్స్ వీడనుంది.
సమాజ్వాదీ పార్టీ యూపీ శాఖ అధ్యక్షుడిగా పార్టీని ఏకతాటిపై నడిపిన అఖిలేష్.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎస్పీని విజయపథంలో నడిపిన సంగతి తెలిసిందే. మాయావతి పరాజయానికి బాటలు పరిచిన సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి కానున్నారు. ములాయం సింగ్ తనయుడు అఖిలేష్ యాదవ్ కే బాధ్యతలను అప్పగించనున్నారు. . రెండు రోజుల కిందట జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కొంతమంది అఖిలేష్కు మొగ్గు చూపితే.. మరికొందరు ములాయమే మళ్లీ సీఎం కావాలని పట్టుబట్టారు. కానీ అఖిలేష్నే ముఖ్యమంత్రిని చేసేలా పార్టీ సీనియర్లను సమాజ్వాదీ అధినేత ములాయంసింగ్ ఒప్పించారని సమాచారం. నేడు జరిగే పార్లమెంటరీ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించనున్నారు.
అయితే మొన్నటి వరకు ములాయం సింగే యూపీ ముఖ్యమంత్రి అని ప్రకటించిన అఖిలేష్... తన తండ్రి మాటను కాదనలేక, తన తండ్రి అనారోగ్యం కారణాల వల్ల బాధ్యతలను చేపట్టడానికి అంగీకరించాడని అఖిలేష్ అంగీకరించాడని తెలుస్తుంది. ఇప్పుడు అఖిలేష్ వయసు 38! యూపీలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. అప్పట్లో మాయావతి అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి పీఠం పై కూర్చున్న వనితా రికార్డు కెక్కారు. అప్పడు ఆమె వయస్సు 39. కానీ ఆమె రికార్డును అఖిలేష్ తుడిసివేయ నున్నారు. మొత్తానికి యూపీ ముఖ్యమంత్రి పీఠం పై అఖిలేష్ యాదవ్ కూర్చోనున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more