పట్టణీకరణలో రాష్ట్రం వెనుకబడిపోతోంది. గత దశాబ్దపు లెక్కల ప్రకారం పట్టణీకరణలో రాష్ట్రం 16వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 17వ స్థానానికి చేరింది. అత్యధిక పట్టణ జనాభా ఉన్న రాష్ట్రంగా గోవా మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని పట్టణాల్లో జనాభా పెరుగుతున్నా.. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే పట్టణీకరణలో వెనుకబడే ఉంది.
రాష్ట్రంలో పట్టణీకరణ ఇంకా జరగాల్సిన అవసరాన్ని తాజా జనాభా లెక్కలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో పట్టణ జనాభా 33 శాతం మాత్రమే ఉంది. తమిళనాడులో 48.45 శాతం, కేరళలో 47.72, మహారాష్ట్రలో 45.23, గుజరాత్లో 42.58 కర్ణాటకలో 38.57, పంజాబ్లో 37.49, హర్యానాలో 34.79 శాతం పట్టణ జనాభా ఉంది. అత్యధిక పట్టణీకరణ జరిగిన మూడు రాష్ట్రాల్లో గోవా, మిజోరం, తమిళనాడు ఉన్నాయి. ఒక ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు పెరగడం, మౌలిక సదుపాయాల కల్పన, వ్యాపార అవకాశాలు మెండుగా ఉండడంతోపాటు, కనీసం 75 శాతం మంది పురుషులు వ్యవసాయేతర పనులు చేస్తున్నవారై ఉంటేనే... ఆ ప్రాంతాన్ని పట్టణ ప్రాంతంగా పరిగణిస్తారు. అదే విధంగా చదరపు కిలోమీటర్కు 400 మంది జనాభా ఉండాలన్న నిబంధనలున్నాయి. రాష్ట్రంలో పట్టణ జనాభా 2001 లెక్కల ప్రకారం 2.08 కోట్లు ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం అది 2.83 కోట్లకు పెరిగింది. అదే సమయంలో గ్రామీణ జనాభా 5.54 కోట్ల నుంచి 5.63 కోట్లకు పెరిగింది. రాష్ట్ర జనాభా పదేళ్లలో మొత్తం 84.55 లక్షలు పెరిగితే ... అందులో ఒక్క పట్టణ ప్రాంతాల్లోనే 75.45 లక్షలు పెరగడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more