బెంచీలు మారిన చంద్రబాబు కేసుని రాష్ట్రాన్నే మార్చటానికి వైయస్ విజయమ్మ సుప్రీం కోర్టు తలుపు తట్టారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అక్రమార్జనతో సంపదలను కూడబెట్టారని ఆరోపిస్తూ చంద్రబాబు, ఆయన అనుచరుల ఆస్తుల విచారణ చేపట్టవలసిందిగా వైయస్ విజయమ్మవేసిన పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు దర్యాప్తుకి సిబిఐని ఆదేశించగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ చంద్రబాబు తన వెకేట్ పిటిషన్ ని తనకు అనుకూలంగా బెంచీలను మారుస్తున్నారని, రాష్ట్రంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు కనుక వేరే రాష్ట్రానికి ఈ కేసుని బదిలీ చెయ్యవలసిందంటూ ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఆ పిటిషన్ లోని అంశాలు ఇవి-
రాష్ట్రంలో నిష్పక్షపాతంగా విచారణ జరగటానికి అనుకూలమైన వాతావరణం కనిపించటం లేదు కాబట్టి మరో హైకోర్టుకి నా రిట్ పిటిషన్ ని బదిలీ చెయ్యాలి.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనకు రిలయన్స్ లో వాటాలున్నందువలన ఈ కేసుని తన బెంచ్ నుంచి బదిలీ చేసారు. అయితే ప్రతివాదులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, వెకేట్ పిటిషన్ ని జస్టిస్ ఈశ్వరయ్య ముందు మాత్రమే వచ్చేటట్టుగా ప్రయత్నం చేసారు. న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు. ఈ విధంగా కేసులో ఆలస్యం జరిగేట్టుగా చూస్తున్నారు. ప్రజా ప్రయోజనం కూడా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి మీద అభియోగం అవటం వలన ఆయన మద్దతుదారులు విచారణను అడ్డుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి, ఈ కేసుని ఇతర హైకోర్టులకు దేనికైనా మార్చటం వలన న్యాయం జరగుతుందని, విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more