టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి క్రికెట్ కు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించడంపై.. టీమిండియా మాజీ సారధి.. బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తనదైన శైలిలో స్పందించారు. భారత క్రికెట్ కు టీమిండియా సారధి విరాట్ కోహ్లీ గొప్ప ఆస్తి అని తెలిపారు. టీమిండియాను విరాట్ కోహ్లీ దిగ్విజయంగా ముందుకు నడిపించారని పేర్కొన్నారు. అయితే భవిష్యత్ కోసమే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చునన్నారు. మూడు ఫార్మాట్లలోనూ విజయవంతమైన కెప్టెన్ అని గంగూలీ కొనియాడారు.
టెస్ట్ క్రికెట్ పై మరింత దృష్టి సారించేందుకే టీ-20 ఫార్మాట్ సారధ్యానికి విరాట్ కోహ్లీ గుడ్బై చెప్పారని వెటరన్ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ వ్యాఖ్యానించారు. కోహ్లీ గొప్ప క్రికెటర్.. టీం ఇండియాకు మరుపు రాని విజయాలు సాధించారని పేర్కొన్నారు. బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందిస్తూ.. కోహ్లీ సేవలు మరువలేనివని ప్రశంసించారు. అయితే విరాట్ కోహ్లీ సతీమణి భార్య అనుష్క శర్మ మాత్రం ఈ విషయంలో కోహ్లికి మద్దతుగా నిలిచింది. ప్రస్తుతం ఐపీఎల్ కోసం దుబాయ్లో విరాట్తోపాటు ఉన్న అనుష్క.. తన భర్త ప్రకటనను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేస్తూ ఇది తనకు నచ్చిందని చెప్పడానికి ఓ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది. ఇందులో విరాట్ కోహ్లిని కూడా ట్యాగ్ చేసింది.
కాగా కోహ్లీ అంశంపై స్పందించిన సునీల్ గవాస్కర్ కోహ్లీ సారథ్య బాధ్యతలను వదిలేస్తుండటంపై ఎలాంటి వ్యాఖ్యలను చేయలేదు. అయితే తనకు టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ గా కేఎల్ రాహుల్ కనిపిస్తున్నాడని గవాస్కర్ అభిప్రాయ పడ్డారు. అయితే రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని బీసీసీఐ భావిస్తోందని... ఈ నేపథ్యంలో రాహుల్ ను కనీసం వైస్ కెప్టెన్ చేయాలని బీసీసీఐకి సూచించారు. రోహిత్ వయసు 35 ఏళ్లని... ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. యువకుడైన కేఎల్ రాహుల్ ను కెప్టెన్ చేస్తే... భవిష్యత్తులో అతను జట్టును సమర్థవంతంగా నడపగలడని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more