తల్లిదండ్రుల ఫొటోలు పెట్టుకుని నంద్యాల బైపోల్ లో సానుభూతి ఓట్ల కోసం ప్రయత్నిస్తుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్న మాటలపై భూమా అఖిలప్రియ స్పందించింది. ఎన్నికల ఒత్తిడి వల్ల వచ్చిన కోపంతో రోజా ఆ మాటలు అనుంటారని, వాటిని తాను పట్టించుకోనని అఖిలప్రియ అంది. అలాగని తన తల్లిదండ్రుల గురించి అనడం సబబు కాదని ఆమె చెప్పింది. `మా తండ్రి మీద ప్రేమ లేదన్నట్లుగా ఆమె మాట్లాడటం నాకు బాధ కలిగించింది. ఆయన చనిపోయాక అసెంబ్లీకి వెళ్లిన మాట నిజమే.. మా తండ్రి కేడర్ దెబ్బతినకూడదనే అంత బాధలోనూ అసెంబ్లీకి వెళ్లాను. అందుకు మెచ్చుకోనున్న తోటి మహిళగా అర్థం చేసుకుంటే బాగుండేది` అని అఖిలప్రియ తెలిపింది.
30 ఏళ్ల రాజకీయ జీవితంలో తన తల్లిదండ్రులు ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని, తాను కూడా చేయబోనని ఆమె పేర్కొన్నారు. సానుభూతి కోసం అమ్మానాన్నల ఫొటోలను ఉపయోగించుకున్నారనే మాటలపై స్పందిస్తూ - `జగన్మోహన్ రెడ్డికి తన తండ్రి ఎలాగో మాకు మా తండ్రి అలాగ. అయినా అలా ఉపయోగించుకుంటే తప్పేంటి?` అని అఖిలప్రియ ప్రశ్నించింది. తన కుటుంబం రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చారని, ఏదో కావాలని వచ్చినట్లు చిత్రీకరించి ఎత్తి చూపించడం సబబు కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలకు తమ కుటుంబం అండగా ఉంటుందని అఖిలప్రియ తెలియజేశారు.
తండ్రి చితి ఆరకముందే మంత్రి పదవి కోసం సంప్రదాయాలన్నింటినీ తుంగలో తొక్కిన నువ్వా, సంప్రదాయం గురించి మాట్లాడేది? అంటూ మంత్రి అఖిలప్రియపైవైఎస్సార్సీపీ నేత రోజా ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. 'సొంత మామ ఎస్వీ మోహన్ రెడ్డి నీ ఇంటికి వచ్చే పరిస్థితి లేకుండా చేసుకున్నావని' ఆమె మండిపడ్డారు. జగన్ నైతికతను ప్రశ్నించే ముందు నువ్వేం చేస్తున్నావో తెలుసుకోవాలని రోజా, అఖిలప్రియకు సూచించారు. ఏ పార్టీ కార్డుతో గెలిచి, ఏ పార్టీలో ఉన్నావో గుర్తుంచుకోవాలని చెబుతూ, నంద్యాల ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నది గ్రహించాలని ఆమె సూచించింది కూడా.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more