తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబు తన తొమ్మిదేళ్ల హాయంలో ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. తెలంగాణ అవిర్భావంతో తాము ఇక్కడి బీడు బూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులు కడుతుంటే అడ్డుకున్నరని.. ఏకంగా 35 కేసులు వేయించారని.. ఇప్పటికీ ఒక కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో వుందని అన్నారు.
ఇక ప్రాజెక్టులను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు ప్రజల ముందకువచ్చి దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారని.. దీంతో పాటు ‘ఆంధ్రా బాబు’తో పొత్తుపెట్టుకుని మీ ముందుకు వస్తున్నారని.. తెలంగాణ ద్రోహులతో జతకట్టిన మహాకూటమి నేతలను కాంగ్రెస్ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన ఆంధ్రబాబును కాంగ్రెస్ వారు భుజాలపై మోస్తున్నందుకు సిగ్గుపడాలని సీఎం కేసీఆర్ విమర్శించారు. శనివారం దేవరకద్రలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోడానికి చంద్రబాబు 35 కేసులు వేయించారని, ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఓ కేసు నడుస్తుందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు బాగుపడడం చూసి.. చంద్రబాబు కళ్లు మండుతున్నాయని అందుకనే ఆయన ఈ సారి కాంగ్రెస్ భుజాలపై ఎక్కి మీ ముందకు వస్తున్నారని విమర్శించారు.
ఇక చంద్రబాబు విమర్శలకు.. కాంగ్రెస్ వారు తాళం కొడుతున్నారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టులపై మహాకూటమి పేరుతో పోటీ చేస్తున్న నాయకులు కోర్టులో కేసులు వేసి ప్రజల ముందు దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులపై కేసులు వేసిన వారిని తరమికొట్టాలని, ఎన్నికల్లో వారికి డిపాజిట్లు రాకుండా తెలంగాణ ప్రజలు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. మనకు ఆంద్రపాలకుల అసవరం వుందా.? మనకు పనులు కావాలంటే ఇక అమరావతికి పరుగులు తీయాలా.? అని ఆయన కేసీఆర్ ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more
Dec 20 | అనంతపురం అభివృద్ధికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అర్ధరూపాయి కూడా ఖర్చు చేయలేదని మేయర్ స్వరూప విమర్శించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ జేసీపై మండిపడ్డారు. అనంతపురం అభివృద్ధికి అడ్డుపడుతున్న రాక్షసుడు జేసీ అని,... Read more