సమాజంలో స్త్రీలకు ఇంకా సరైన గౌరవం, మర్యాద లభించిన రోజుల్లో కొందరు మహిళలు వివిధ రంగాల్లో తమ సత్తా చాటుకుని సాటి మహిళలకు ఆదర్శంగా నిలిచారు. పురుషులకు తాము ఏమాత్రం తీసిపోమని ఆరోజుల్లో చేసి నిరూపించారు. తాము తలుచుకుంటే ఏ రికార్డులనైనా బద్దలు కొడతామంటూ మహిళలు ముందుకు దూసుకెళ్లారు. అలాంటి వారిలో జస్టిస్ అమరేశ్వరి ఒకరు. ఒక సాధారణ వ్యవసాయం కుటుంబంలో జన్మించిన ఆమె.. దేశంలో న్యాయమూర్తిగా పనిచేసిన తొలిమహిళగా రికార్డు సృష్టించారు. లక్ష్యాన్ని చేరుకోవడంలో పేదరికం ఏమాత్రం అడ్డురాదని నిరూపించిన ఆమె.. సాటి మహిళల్లో ఏమైనా సాధించగలమన్న చైతన్యాన్ని నింపారు.
జీవిత విశేషాలు :
1928 జులై 10వ తేదీన గుంటూరు జిల్లా అప్పికట్ల గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబములో అమరేశ్వరి జన్మించారు. బాల్యం నుంచే విద్యాభ్యాసంలో ఎంతో చురుకుగా వుండేది. పై చదువులు చదవాలని ఈమెకు కోరికలున్నప్పటికీ.. కుటుంబసభ్యులు ఆమె 14వ ఏటలోనే పెళ్లి చేశారు. వివాహం అయిన తర్వాత విద్యాభ్యాసం మీద ఆమెకున్న ఆసక్తిని గమనించిన ఆమె భర్త ఆమెకు ప్రోత్సహించారు. భర్త ప్రోత్సాహంతో ఆమె చదువు సాగించి.. ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు నుండి రాజకీయ శాస్త్రము, చరిత్రలో 1948 సంవత్సరములో M.A పట్టభద్రురాలయ్యారు. అనంతరం న్యాయశాస్త్రంలో కూడా ఆమె పట్టా పొంది.. మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేశారు.
1960-1961లో బార్ కౌన్సిల్ సభ్యురాలు. ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు)లో 1978 ఏప్రిల్ 29వ తేదీన న్యాయమూర్తిగా నియమింపబడి దేశంలోనే తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డు నెలకొల్పారు. ఈమె పదమూడున్నర సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి.. 1990 సంలో సీనియర్ గా పదోన్నతి పొంది పదవీ విరమణ చేశారు. ఈమె 1975-1976 మధ్యకాలంలో భారత మహిళా న్యాయవాదుల సంఘానికి ఉపాధ్యక్షురాలిగా.. ఆంధ్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదుల సంఘానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఈమె అనారోగ్య కారణాల వల్ల 2009 జులై 25వ తేదీన న్యూఢిల్లీలో మరణించారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more