సాటి మనిషికి సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాని ఈ సమాజంలో మూగజంతువుల పట్ల కనీసం కనికరం చూపేవారు చాలా అరుదు. ఆ తక్కువ వ్యక్తుల్లో దేవనబోయిన నాగలక్ష్మి ఒకరు. మూగజీవుల పట్ల మానవత్వం కలిగిన ఈమె.. వాటికోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలనే తపనతో జంతుశాస్త్రంలో విద్యాభ్యాసం గడించి.. ఆపై ఎన్నో పరిశోధనలు చేసింది. అందులో భాగంగానే ఈమె పశువుల దాణాను వినూత్న విధానాల ద్వారా రూపొందించడం మీదే ఎక్కువ పరిశోధనలు చేసింది. అడవులు తరిగిపోతున్న నేపథ్యంలో జంతువులకు ప్రత్యామ్నాయ దాణా ఆవశ్యతను గుర్తించి.. ఆ మేరకు పరిశోధనలు ప్రారంభించారు. ఇందుకుగాను ఆమెకు ఎన్నో అవార్డులు వరించాయి.
జీవిత విశేషాలు :
1969 సెప్టెంబర్ 24వ తేదీన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో నాగలక్ష్మీ జన్మించారు. తండ్రి సైనికోద్యోగి కావడంతో ఆమె విద్యాభ్యాసం మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగింది. ఈమె జబల్ పూర్ లో డిగ్రీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం యిజ్జత్ నగరంలోని ఐ.వి.ఆర్.ఇనిస్టిట్యూట్ లో పోస్టు గ్రాడ్యుయేట్ చదివారు. అనంతరం ఈమె ‘యానిమల్ న్యూట్రిషన్’ అంశంలో పరిశోధనలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆమె ఈ విశ్వవిద్యాలయంలో ఐ.సి.ఎ.ఆర్ ఫెలోషిప్ అందుకున్నారు. పి.జి చేసి కొన్ని ఉద్యోగాలలో చేరిన అనంతరం యానిమల్ సైన్సెస్ లో ఒంటరి మహిళగా పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు.
పరిశోధనా జీవితం :
అడవులు క్రమంగా తరిగిపోతున్న నేపథ్యంలో.. పశువులకు ప్రత్యామ్నాయ దాణా ఆవశ్యకతను గుర్తించి ఆమె వినూత్న విధానాల ద్వారా దాణాను రూపొందించడం మీదే పరిశోధనలు ప్రారంభించారు.
* చెరకు పిప్పిని ఎరువుగానే కాకుండా దాణాకు వాడవచ్చునని నిరూపించారు.
* మొక్కజొన్నల్ని తీసివేసిన తర్వాత మిగిలే కంకులను మేతగా ఉపయోగించే మార్గం కనుగొన్నారు.
* ఇళ్ళలో మిగిలిన ఆహార పదార్థాలను, చెత్తను కూడా పశువుల దాణాగా రూపొందించడమే ఈమె పరిశోధనా విజయమైంది.
*పత్తి గింజల్లో ఉండే గాసిపాల్ అనే విష పదార్థాన్ని తొలగించేందుకు కొన్ని పద్ధతులను అనుసరిస్తే దాణాగా ఉపయోగపడుతుందని చెప్పారు.
* వేపగింజలు, పత్తి గింజలు నుంచి నూనెను తీసివేసిన తరువాత మిగిలిన పిండిని కేక్ ను ఎరువుగానే కాకుండా పశువుల దాణాకు కూడా వాడవచ్చునని నిరూపించారు.
* చేదైన వేప గింజల పిండికి యూరియా, ఆల్కలీ ట్రీట్ మెంటు ఇవ్వడం ద్వారా ఆయా విషాలను పోగొట్టి దాణాగా వాడితే జంతువులకూ చాలా బలవర్ధకమైన ఆహారం కాగలదని రుజువు చేశారు.
అవార్డులు :
పశువుల దాణాను వినూత్న విధానాల ద్వారా రూపొందించడంలో విజయవంతమైన ఈమెను.. 2003లో అఖిల భారత యానిమల్ సైన్సెస్ లో వున్న నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ (నాస్) 2001-2002 సంవత్సరానికిగాను ‘యంగ్ సైంటిస్టు అవార్డుకు ఎంపిక చేసింది. యానిమల్ సైన్సెస్ లో విశేష పరిశోధనా కృషి చేసినవారిని వరించే ఈ అవార్డును ఈమె 2003 ఫిబ్రవరిలో భోపాల్ లోజరిగిన 6వ వ్యవసాయ విజ్ఞాన కాంగ్రెస్ లో అందుకున్నారు. ఆనిమల్ న్యూట్రిషన్ అసోసియేషన్ లో జీవితకాల సభ్యత్వం పొందిన ఈమె.. ‘మిసెస్ మిమల్ శ్రీనివాస్ క్షీరసాగర్ మెమోరియల్ అవార్డు’ ను అందుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more