ప్రపంచంలో ఎన్నో బంధాలు - అనుబంధాలు ఉంటాయి. అయితే ఆ అనుబంధాలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా పండుగ అంటూ ఉండదు. కానీ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా మాత్రం ఒక విశిష్టమైన పండుగ ఉంది. అదే రక్షాబంధనం. దీనికి రక్తసంబంధంతో పనిలేదు. ఎవరినైనా సరే తన సోదరుడిగా భావించాలనుకునే సోదరి, కేవలం రక్షాబంధనంతో ఆ బంధాన్ని శాశ్వతం చేసుకుంటుంది.
పురాణాలలో చూస్తే, శ్రీకృష్ణుడికి ద్రౌపది సహోదరి కాకపోయినా, ఆమెకు కురుసభలో వస్త్రాపహరణం జరిగి, అవ మాన భారంతో ఉన్నప్పుడు చీరలు ఇచ్చి రక్షించాడు ఒక సోదరుడిగా శ్రీకృష్ణుడు. జీవితాంతం ఆ బంధం అలాగే కొనసాగింది. సుభద్ర... అర్జునుడిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు, ఒక సోదరుడిగా ఆమె కోరిక నెరవేరేలా చేశాడు. ఇదంతా దైవానికి సంబంధించిన నేపథ్యం.రాక్షసులు సైతం ఈ ప్రేమకు అతీతులు కారు. అయితే వారి ప్రేమ వ్యక్తం చేసినప్పుడు, అది వినాశనానికి దారి తీస్తుంది. శూర్పణఖ తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోమని అన్నగారైన రావణుడిని వేడుకుంది. ఆమె కోరిక నెరవేర్చాడు. అయితే దాని ఫలితంగా లంకా వినాశనం జరిగింది. ఏది ఏమైనా మానవులలోనే కాకుండా దానవులలోనూ అన్నచెల్లెళ్ల అనుబంధం ఉంటుందని ఈ కథనం ద్వారా అర్థం అవుతుంది.
రాఖీ పండుగు ఆ పేరెలా వచ్చింది?
రాకా అనే మాటకి నిండుగా తన కున్న పదిహేను కళలలతోనూ చంద్రు డు ఉన్న పూర్ణి అని అర్థం. ఆ రాకా అంటే పౌర్ణమి రోజున కట్టే సూత్రం ఎదుందో దానికి రాకీ (రాకా సంబంధమున్న తాడు) పౌర్ణమి అని పేరు. కాలానుగుణంగా రాఖీ పౌర్ణమి, రాకీ సూత్రం రాఖీగా మారింది. ఈ పూర్ణిరోజున ఉదయ కాలంలో చక్కగా స్నానం చేసిన వ్యక్తి ఈ రాకీ సూత్రాన్ని తానెవరికి రక్షణగా సంవత్సర కాలం పాటు ఉండదలిచాడో వాళ్ల మణికట్టుకు కట్టి ముడివేసి దానిమీద అక్షతలు మనసూర్తిగా వేయాలని హేమచంద్ర గ్రంధంలో చెప్పబడింది.
పండుగ పరమార్థం
శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమనాడు సోదరిచేత రక్ష కట్టింకుం టే దేవతలందరి రక్షణ కలుగుతుందని ప్రాచీన కాలం నుంచి వస్తున్న విశ్వాసం. భారతీయ సంద్రాయం ప్రకారం ఇంటి ఆడప డుచు శక్తి స్వరూపిణి. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మికి ప్రతిరూపం. అందుకే ఆమెను తల్లిదండ్రులు మంగళ, శుక్రవా రాల్లో పుట్టింటి నుండి పంపరు. అంతటి శక్తి గల సోదరిచేత రక్షాబంధన్ కట్టిం చుకుంటే అరిష్టాలన్నీ తొలగి దేవత లందరి అనుగ్రహం కలుగు తుందని మన పూర్వీకులు ఈ సంప్రదా యాన్ని ఆచరించారు. నుదుట తిలకం దిద్ది సోదరునికి దేవతలందరూ రక్షగా ఉం డాలంటూ ...రక్షాబంధన్ కట్టి తీపి తినిపిస్తుంది. అందు కు ప్రతిగా సోదరుడు తన ప్రాణాలు త్యాగం చేసైనా సరే ఆమెకు జీవితాంతం అండగా నిలుస్తాతని మానమర్యాదలు కాపాడతానని చెబుతూ ఆమెకు పసుపు, కుంకుమ ఇవ్వడం సంప్రదాయం.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more