మన దేశంలో నిజమైన ఎడిటర్లుగా చెప్పదగిన కొద్ది మందిలో వినోద్ మెహతా ఒకరు. ఇంగ్లీషు వీక్లీలలో కొత్త ఒరవడిని సుష్టించిన వినోద్ మెహతా ఆత్మకథే లక్నోబాయ్. సమకాలిన రాజకీయాలు, రాజకీయ నాయకులపై విస్పష్టమైన అభిప్రాయాలున్న వినోద్ మెహతా – గత పదిహేనేళ్లలో జరిగిన సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి. వాటిని సజీవంగా మన ముందు ఉంచిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం. గత ఏడేళ్లలో సోనియాను 6 సార్లు కలిసుంటాను. నేను జన్ పథ్ 10 ఎడిటర్ ని అనుకునే వారికి ఇది చాలా ఆశ్చర్యం కలిగించవచ్చు. నేను ఎప్పుడూ రాజ్యసభ సీటు కాని, పద్మశ్రీ బిరుదు కాని, ఏదైనా దేశానికి రాయబారిగా నియమించమని కాని ఎన్నికల్లో టిక్కెట్ కానీ అడగలేదు. ఇదేమీ నాకు ఇస్తానని ఆశ చూపలేదు. అవుట్ లుక్ వార్షికోత్సవ సభను ఆమెను ముఖ్య అథితిగా రమ్మని పిలిచాను. ఆమె వచ్చింది. ‘‘ ఏ పబ్లిక ఫంక్షన్ కైనా సరే మన్మోహన్ కన్నా ఒక ఐదు నిమిషాలు ముందు వెళ్తా. ఆయన వెళ్లిన తర్వాతే అక్కడ నుంచి వెళ్తా.. అది ప్రోటోకాల్ అని ఆమె చేసిన వ్యాఖ్యలు. ఈ విషయాలలో సోనియా ఎంత జాగ్రత్తగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తాయి. ఆమె ఒక నియంత అనే ఆరోపణ నిజం కాదు. తన వ్యక్తిగత స్థానానికి, కుటుంబానికి సమస్య రానంత వరకూ – సోనియా అందరితోను మాట్లాడి.. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవటానికే ప్రయత్నిస్తారు. దేశంలో అతి ముఖ్యమైన రాష్టానికి చెందిన ముఖ్యమంత్రిని ఒకరు తన పని వదిలేసి డబ్బు సంపాదించటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ‘‘దీపావళి సెలవులు అయిపోయిన తరువాత ఆయన్ని తొలగిస్తాం’’ అని సోనియా నాతో చెప్పారు. కానీ ఆ ముఖ్యమంత్రిని తొలగించటానికి ఆ తర్వాత 18 నెలలు పట్టింది. ఏదైనా క్లిష్టమైన సమస్య ఎదురయినప్పుడు – తొలి స్పందన నైతికంగాను, వ్యూహత్మకంగాను మంచిదే అయి ఉంటుంది. కాని సీనియర్ నేతలతోను, సలహాదారులతోనూ మాట్లాడిన తరువాత ఆమె పూర్తి విరుద్ధమైన నిర్ణయం తీసుకుంటారు. రెండు ముఖ్యమైన పాఠాలు : తన వ్యక్తిగతమైన వ్యవహారాలకు సంబంధించి మాత్రం ఆమె ఎవరినీ సంప్రదించదు. తమ పిల్లలతో మాత్రమే మాట్లాడతారు. అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటారు. 2004, మేలో అధికార పగ్గాలు మన్మోహన్ సింగ్ కి అప్పగించాలని నిర్ణయించినప్పుడు – రాహుల్, ప్రియాంకలనే సంప్రదించారు. 2006లో ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ వివాదంలో రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు కూడా వారినే సంప్రదించారు. తన అత్తగారి నుండి సోనియా రెండు పాఠాలు నేర్చుకున్నారు. ఎన్నికల్లో గెలవాలంటే మధ్యతరగతి వారి వెంట పడితే ఏం ప్రయోజనం ఉండదు. పేద ప్రజలను ఆకర్షిస్తేనే పని అవుతుందనేది మొదటి పాఠం. రెండోది – పెళ్ళి అయిన మహిళలకు సంబంధించినది. వివాహిత మహిళలు రాజకీయాల్లోకి వస్తే చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుదనేది. జవహార్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ఇంటి బాధ్యతలు చేపట్టడం వల్ల ఇందిర విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. తన భర్త రాజకీయాల్లోకి రాకూడదని ఆమె తీవ్రంగా ప్రయత్నించడానికి కారణం కూడా అదే కావచ్చు. రాజీవ్ మరణాంతరం కాంగ్రెస్ లో ఎలాంటి పాత్ర పోషించాలనే విషయం పై సందిగ్ధతతో ఉండటానికి కూడా కారణం అదే కావచ్చు. అనేక మంది డిమాండ్ చేసినా ప్రియాంక పార్టీలోకి రాకపోవడానికి కూడా అదే కారణం కావచ్చు. ’ఆమె కాపురం.. ఆమె పిల్లలు – ఇవి రెండు చాలా ముఖ్యమైన బాధ్యతలు. ఆ తర్వాతే జాతీయ బాధ్యతలు, పార్టీ బాధ్యతలైనా అని నాతో చెప్పారు. |
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more